రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో నాలుగు నెలలే సమయం ఉండటంలో ప్రధాన పార్టీల్లో టికెట్ల కేటాయింపుకి సంబంధించిన హడావుడి నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. పనితనం సరిగా లేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపించి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఆయన టికెట్ నిరాకరిస్తారని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో రాములు నాయక్ కూడా ఒకరు. వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాములుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలడంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోతు చంద్రావతి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
కాగా మదన్ లాల్ వైపే కేసీఆర్ మొగ్గుతున్నారని.. ఆయనకు టికెట్ గ్యారెంటీ అని మద్దతుదారులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మదన్ లాల్ ఒక మహిళతో రాసలీలలు నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫొటోలను వైరల్ చేశారు. ఆ తర్వాత అవి ట్విట్టర్, ఫేస్ బుక్ల్లోకి కూడా వచ్చేశాయి. ఇది రాములు నాయక్ మద్దతుదారులు చేసిన కుట్రగానే భావిస్తున్నారు.
మదన్ లాల్కు టికెట్ గ్యారెంటీ అనే సమాచారంతో ఆయన్ని అన్పాపులర్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయనివ్వకుండా చేయాలని వ్యూహం పన్నినట్లుగా భావిస్తున్నారు. ఇవి మార్ఫింగ్ ఫొటోలని.. రాములు నాయక్ వర్గం కావాలనే ఇలా చేసిందని.. మదన్ లాల్కే టికెట్ గ్యారెంటీ అని.. అంతే కాక రాములు మీద క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 10:18 am
తెలంగాణలో జున్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిన వ్యవహారం రాజకీయంగా…
‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు.…
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నట్టుగా…
టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే విషయంలో ప్రతిసారీ ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి కూడా అందుకు…
సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. వీటిలో ఏది అతి పెద్ద డిజాస్టర్, కంటెంట్…
రాష్ట్రంలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ ఎన్నికల పోలింగ్ ప్రత్యక్షంగా…