తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చేరికలతో పార్టీలు బిజీ అయిపోయాయి. మరోవైపు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్.. కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే కొంతమంది నాయకులకు టికెట్లు దక్కవనే ప్రచారం సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన బాట పట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దొంటూ, మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చొద్దంటూ ఆందోళనలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయిద్దనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ధర్నా చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇక స్టేషన్ ఘన్ పూర్లో పరిస్థితి ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్లుగా మారింది. తన నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ రెండు వర్గాల అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు మరోసారి టికెట్ ఇవ్వొద్దంటూ అక్కడి నాయకులు మంత్రి హరీష్ రావును కలవడం కలకలం రేపింది. ఇల్లెందు నుంచి మరోసారి హరిప్రియ పోటీ చేస్తే గెలవడం కష్టమని అక్కడి బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. మరి పార్టీలోని నేతల మధ్య ఈ విభేదాలను, తగాదాలను కేసీఆర్ ఎలా తీరుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.
This post was last modified on August 20, 2023 4:54 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…