Political News

ఏం బాగుంది పవన్‌..బాబు దోపిడీ, పెత్తందారి వ్యవస్థనా?: బొత్స!

పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు ఈ సెలబ్రిటీ పవన్ కల్యాణ్‌ కు అలాగే కనిపిస్తుందని విమర్శలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అసలు రాష్ట్రంలో నివాసమే ఉండని వాళ్లకి ఇక్కడి బాధలు తెలుస్తాయా అంటూ విమర్శలు చేశారు. ఏంటి వైసీపీతో పోల్చితే తనకు టీడీపీ పాలన నచ్చిందని పవన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

మరి టీడీపీ పాలన బాగుంటే ప్రజలు ఎందుకు వారిని ఓడించి ఇంటికి పంపారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రాష్ట్రానికి మూడు పక్కల తిరుగుతున్నారు కానీ..మామూలు రోజుల్లో ఎప్పుడైనా వచ్చారా అంటూ ఆయన నిలదీశారు. తెలుగు దేశం అధికారంలో ఉండగా జరిగిన దోపిడీ, పెత్తందారి తనాలు… రాష్ట్రామంతా కలియ తిరిగేస్తున్న ఈ సెలెబ్రిటీకి కనిపించడం లేదా? ఆయన ఎద్దేవా చేశారు.

రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల నిర్మాణం… పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి… నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు” అని బొత్స వ్యాఖ్యానించారు. వైసీపీను గద్దె దించాలని సెలెబ్రిటీ అంటున్నారని, ఎందుకు గద్దె దించాలని అంటున్నారో, దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో కూడా ఆ సెలెబ్రిటీ చెబితే బాగుంటుందని బొత్స అన్నారు.

ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి ముగుస్తుందని, ఈ ఆర్నెల్లు వినిపించే అరుపులు, కేకలు ఆ తర్వాత ఉండవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు మంత్రి బొత్స. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యే­క హోదా సాధనే తమ పార్టీ విధానమని చెప్పారు. అసలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు.

హోదా కాదు ప్యాకేజీ చాలు అంటూ కేంద్ర పెద్దలతో స్వీట్లు పంచుకుని శాలువాల్ని కప్పించుకుంది చంద్రబాబే అని గుర్తు చేశారు.హైదరాబాద్‌లో నివసించే పవన్‌ ఆంధ్ర గురించి, అందులో ఒక కొండ గురించి అంతగా ఎందుకు బాధ పడుతున్నాడని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని…. ఈ సెలబ్రిటీ పవన్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి ఆశపడి పార్టీ పెట్టి అద్భుతాల్ని సృష్టిస్తానంటూ కలలు కంటే ఏం జరగదన్నా రు.

“సెల్‌ఫోన్ నేనే కనిపెట్టాను లాంటి డాబు మాటల్ని చెప్పడానికి చంద్రబాబుకి సిగ్గు కూడా లేదేమో? ఆ పవన్ కళ్యాణ్ ఒకరు.. చంద్రబాబు పాలన బాగుందని చెప్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు, జన్మభూమి కమిటీ అక్రమాలు, పెత్తందారి వ్యవస్థ అతనికి బాగుందా…?” – మంత్రి బొత్స సత్యనారాయణ

This post was last modified on August 20, 2023 4:51 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

43 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago