ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు శరాఘాతమనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యే రాములు నాయక్కు టికెట్ దక్కదనే విషయం ఖాయమైందని సమాచారం. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. దీంతో ఈ సారి అక్కడ నుంచి రాములు నాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే విషయం తెలుసుకున్న రాములు నాయక్.. కేసీఆర్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ను కలిసేందుకు తన కుమారుడు జీవన్ లాల్తో కలిసి రాములు నాయక్ మూడు రోజులుగా హైదారబాద్లోనే మకాం వేశారు. కానీ రాములు నాయక్కు కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. టికెట్ కోసం చివరి ప్రయత్నంగా కేసీఆర్ను కలిసేందుకు రాములు నాయక్ గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని టాక్.
కేసీఆర్ కలిసేందుకు ఇష్టపడకపోవడంతో రాములు నాయక్ నిరాశలో మునిగి పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మంత్రి కేటీఆర్ను కలిసినా టికెట్పై రాములు నాయక్కు హామీ దక్కలేదని తెలిసింది. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. తనకు కాకపోయినా కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేదని తెలిసింది. పట్టు వీడని రాములు నాయక్ మంత్రి హరీష్ రావును కలిసినా టికెట్పై హామీ దొరకలేదని సమాచారం.
This post was last modified on August 20, 2023 4:53 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…