ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు శరాఘాతమనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యే రాములు నాయక్కు టికెట్ దక్కదనే విషయం ఖాయమైందని సమాచారం. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. దీంతో ఈ సారి అక్కడ నుంచి రాములు నాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే విషయం తెలుసుకున్న రాములు నాయక్.. కేసీఆర్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ను కలిసేందుకు తన కుమారుడు జీవన్ లాల్తో కలిసి రాములు నాయక్ మూడు రోజులుగా హైదారబాద్లోనే మకాం వేశారు. కానీ రాములు నాయక్కు కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. టికెట్ కోసం చివరి ప్రయత్నంగా కేసీఆర్ను కలిసేందుకు రాములు నాయక్ గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని టాక్.
కేసీఆర్ కలిసేందుకు ఇష్టపడకపోవడంతో రాములు నాయక్ నిరాశలో మునిగి పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మంత్రి కేటీఆర్ను కలిసినా టికెట్పై రాములు నాయక్కు హామీ దక్కలేదని తెలిసింది. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. తనకు కాకపోయినా కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేదని తెలిసింది. పట్టు వీడని రాములు నాయక్ మంత్రి హరీష్ రావును కలిసినా టికెట్పై హామీ దొరకలేదని సమాచారం.
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…