ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు శరాఘాతమనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యే రాములు నాయక్కు టికెట్ దక్కదనే విషయం ఖాయమైందని సమాచారం. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. దీంతో ఈ సారి అక్కడ నుంచి రాములు నాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే విషయం తెలుసుకున్న రాములు నాయక్.. కేసీఆర్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ను కలిసేందుకు తన కుమారుడు జీవన్ లాల్తో కలిసి రాములు నాయక్ మూడు రోజులుగా హైదారబాద్లోనే మకాం వేశారు. కానీ రాములు నాయక్కు కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. టికెట్ కోసం చివరి ప్రయత్నంగా కేసీఆర్ను కలిసేందుకు రాములు నాయక్ గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని టాక్.
కేసీఆర్ కలిసేందుకు ఇష్టపడకపోవడంతో రాములు నాయక్ నిరాశలో మునిగి పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మంత్రి కేటీఆర్ను కలిసినా టికెట్పై రాములు నాయక్కు హామీ దక్కలేదని తెలిసింది. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. తనకు కాకపోయినా కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేదని తెలిసింది. పట్టు వీడని రాములు నాయక్ మంత్రి హరీష్ రావును కలిసినా టికెట్పై హామీ దొరకలేదని సమాచారం.
This post was last modified on August 20, 2023 4:53 pm
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…