ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు శరాఘాతమనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యే రాములు నాయక్కు టికెట్ దక్కదనే విషయం ఖాయమైందని సమాచారం. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. దీంతో ఈ సారి అక్కడ నుంచి రాములు నాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే విషయం తెలుసుకున్న రాములు నాయక్.. కేసీఆర్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ను కలిసేందుకు తన కుమారుడు జీవన్ లాల్తో కలిసి రాములు నాయక్ మూడు రోజులుగా హైదారబాద్లోనే మకాం వేశారు. కానీ రాములు నాయక్కు కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. టికెట్ కోసం చివరి ప్రయత్నంగా కేసీఆర్ను కలిసేందుకు రాములు నాయక్ గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని టాక్.
కేసీఆర్ కలిసేందుకు ఇష్టపడకపోవడంతో రాములు నాయక్ నిరాశలో మునిగి పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మంత్రి కేటీఆర్ను కలిసినా టికెట్పై రాములు నాయక్కు హామీ దక్కలేదని తెలిసింది. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. తనకు కాకపోయినా కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేదని తెలిసింది. పట్టు వీడని రాములు నాయక్ మంత్రి హరీష్ రావును కలిసినా టికెట్పై హామీ దొరకలేదని సమాచారం.
This post was last modified on August 20, 2023 4:53 pm
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…