స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతున్నట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల మధ్యే రాజకీయ పోరు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోరు ముదురుతుందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య తనకే మరోసారి టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. మరోవైపు ఈ సారి పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలంటూ ప్రజలను కడియం కోరుతున్నారు.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నారని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కూడా టాక్. అలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్పూర్ కూడా ఉంటుందని తాజాగా కడియం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలని ఇప్పటికే కడియం ప్రచారం మొదలెట్టినట్టు కనిపిస్తున్నారు.
సర్పంచ్ వివాదం రాజయ్యపై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ కాకుండా కొంత కాలం నుంచి కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య విమర్శలు చేస్తున్నారు. అందుకే వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యను కాదని ఈ సారి టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. అదే జరిగితే మరి రాజయ్య పరిస్థితి ఏమిటన్నది చూడాలి.
This post was last modified on August 20, 2023 7:59 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…