స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతున్నట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల మధ్యే రాజకీయ పోరు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోరు ముదురుతుందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య తనకే మరోసారి టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. మరోవైపు ఈ సారి పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలంటూ ప్రజలను కడియం కోరుతున్నారు.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నారని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కూడా టాక్. అలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్పూర్ కూడా ఉంటుందని తాజాగా కడియం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలని ఇప్పటికే కడియం ప్రచారం మొదలెట్టినట్టు కనిపిస్తున్నారు.
సర్పంచ్ వివాదం రాజయ్యపై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ కాకుండా కొంత కాలం నుంచి కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య విమర్శలు చేస్తున్నారు. అందుకే వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యను కాదని ఈ సారి టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. అదే జరిగితే మరి రాజయ్య పరిస్థితి ఏమిటన్నది చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…