Political News

వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలు.. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏ పార్టీలోనైనా అధిష్ఠానం ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీలైతే రాష్ట్ర స్థాయిలోనే ఆ ప్రక్రియ ముగుస్తుంది. అదే జాతీయ పార్టీలైతే ఢిల్లీలో ఆ పని జరుగుతుంది. జాతీయ పార్టీలోనైతే స్థానిక నేతల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రజల్లో ఉంటున్నారా? లాంటి విషయాలను పరిశీలించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇస్తారు. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడమే అందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల విషయంపై నివేదిక అందించాలని ఇతర రాష్ట్రాలకు చెందిన 119 ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పజెప్పింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు పర్యటించి, ఆ తర్వాత నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? ఇక్కడ పార్టీని గెలిపించే నాయకులు ఉన్నారా? నేతల మధ్య సమన్వయం లాంటి విషయాలను ఈ ఎమ్మెల్యేలు పరిశీలిస్తారని తెలిసింది.

కానీ ఏ పార్టీలోనైనా స్థానిక నేతలకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు అధిష్ఠానం అప్పజెప్పిందనే వార్తలొచ్చాయి. మళ్లీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

This post was last modified on August 19, 2023 3:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago