ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏ పార్టీలోనైనా అధిష్ఠానం ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీలైతే రాష్ట్ర స్థాయిలోనే ఆ ప్రక్రియ ముగుస్తుంది. అదే జాతీయ పార్టీలైతే ఢిల్లీలో ఆ పని జరుగుతుంది. జాతీయ పార్టీలోనైతే స్థానిక నేతల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రజల్లో ఉంటున్నారా? లాంటి విషయాలను పరిశీలించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇస్తారు. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడమే అందుకు కారణం.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల విషయంపై నివేదిక అందించాలని ఇతర రాష్ట్రాలకు చెందిన 119 ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పజెప్పింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు పర్యటించి, ఆ తర్వాత నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? ఇక్కడ పార్టీని గెలిపించే నాయకులు ఉన్నారా? నేతల మధ్య సమన్వయం లాంటి విషయాలను ఈ ఎమ్మెల్యేలు పరిశీలిస్తారని తెలిసింది.
కానీ ఏ పార్టీలోనైనా స్థానిక నేతలకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు అధిష్ఠానం అప్పజెప్పిందనే వార్తలొచ్చాయి. మళ్లీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
This post was last modified on August 19, 2023 3:27 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…