Political News

వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలు.. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏ పార్టీలోనైనా అధిష్ఠానం ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీలైతే రాష్ట్ర స్థాయిలోనే ఆ ప్రక్రియ ముగుస్తుంది. అదే జాతీయ పార్టీలైతే ఢిల్లీలో ఆ పని జరుగుతుంది. జాతీయ పార్టీలోనైతే స్థానిక నేతల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రజల్లో ఉంటున్నారా? లాంటి విషయాలను పరిశీలించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇస్తారు. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడమే అందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల విషయంపై నివేదిక అందించాలని ఇతర రాష్ట్రాలకు చెందిన 119 ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పజెప్పింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు పర్యటించి, ఆ తర్వాత నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? ఇక్కడ పార్టీని గెలిపించే నాయకులు ఉన్నారా? నేతల మధ్య సమన్వయం లాంటి విషయాలను ఈ ఎమ్మెల్యేలు పరిశీలిస్తారని తెలిసింది.

కానీ ఏ పార్టీలోనైనా స్థానిక నేతలకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు అధిష్ఠానం అప్పజెప్పిందనే వార్తలొచ్చాయి. మళ్లీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

This post was last modified on August 19, 2023 3:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago