Political News

వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలు.. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏ పార్టీలోనైనా అధిష్ఠానం ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీలైతే రాష్ట్ర స్థాయిలోనే ఆ ప్రక్రియ ముగుస్తుంది. అదే జాతీయ పార్టీలైతే ఢిల్లీలో ఆ పని జరుగుతుంది. జాతీయ పార్టీలోనైతే స్థానిక నేతల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రజల్లో ఉంటున్నారా? లాంటి విషయాలను పరిశీలించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇస్తారు. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడమే అందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల విషయంపై నివేదిక అందించాలని ఇతర రాష్ట్రాలకు చెందిన 119 ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పజెప్పింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు పర్యటించి, ఆ తర్వాత నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? ఇక్కడ పార్టీని గెలిపించే నాయకులు ఉన్నారా? నేతల మధ్య సమన్వయం లాంటి విషయాలను ఈ ఎమ్మెల్యేలు పరిశీలిస్తారని తెలిసింది.

కానీ ఏ పార్టీలోనైనా స్థానిక నేతలకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు అధిష్ఠానం అప్పజెప్పిందనే వార్తలొచ్చాయి. మళ్లీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Satya

Recent Posts

OG 2 అనుమానాలు తీరిపోయాయి

గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…

2 minutes ago

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

32 minutes ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

44 minutes ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

2 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

2 hours ago

బంగారం బోణీ నిజంగా బంగారమే

సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…

2 hours ago