ఓ వైపు తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కసరత్తుల్లో నిమగ్నమైన కేసీఆర్.. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. వీలుంటే చాలు మహారాష్ట్రలో సభలు పెడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు, పాలన గురించి గొప్పగా చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఎవరొచ్చినా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీనియర్ నటి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది.
జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. జయప్రదను చేర్చుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేయించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. దీంతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను మహారాష్ట్రలో నిలబెడితే గెలిచి అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ చనిపోవడంతో జయప్రద సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. రాజకీయంగా కెరీర్ను ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూస్తున్నట్లు టాక్.
This post was last modified on August 19, 2023 3:18 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…