Political News

మహారాష్ట్రలో ఆ సీనియర్ నటి.. కేసీఆర్ ప్లాన్

ఓ వైపు తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కసరత్తుల్లో నిమగ్నమైన కేసీఆర్.. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. వీలుంటే చాలు మహారాష్ట్రలో సభలు పెడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు, పాలన గురించి గొప్పగా చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఎవరొచ్చినా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీనియర్ నటి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది.

జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. జయప్రదను చేర్చుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేయించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. దీంతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను మహారాష్ట్రలో నిలబెడితే గెలిచి అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

టీడీపీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ చనిపోవడంతో జయప్రద సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. రాజకీయంగా కెరీర్ను ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూస్తున్నట్లు టాక్.

This post was last modified on August 19, 2023 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

5 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago