ఓ వైపు తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కసరత్తుల్లో నిమగ్నమైన కేసీఆర్.. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. వీలుంటే చాలు మహారాష్ట్రలో సభలు పెడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు, పాలన గురించి గొప్పగా చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఎవరొచ్చినా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీనియర్ నటి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది.
జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. జయప్రదను చేర్చుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేయించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. దీంతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను మహారాష్ట్రలో నిలబెడితే గెలిచి అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ చనిపోవడంతో జయప్రద సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. రాజకీయంగా కెరీర్ను ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూస్తున్నట్లు టాక్.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…