Political News

మహారాష్ట్రలో ఆ సీనియర్ నటి.. కేసీఆర్ ప్లాన్

ఓ వైపు తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కసరత్తుల్లో నిమగ్నమైన కేసీఆర్.. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. వీలుంటే చాలు మహారాష్ట్రలో సభలు పెడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు, పాలన గురించి గొప్పగా చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఎవరొచ్చినా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీనియర్ నటి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది.

జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. జయప్రదను చేర్చుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేయించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. దీంతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను మహారాష్ట్రలో నిలబెడితే గెలిచి అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

టీడీపీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ చనిపోవడంతో జయప్రద సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. రాజకీయంగా కెరీర్ను ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూస్తున్నట్లు టాక్.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago