బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ నిజమే చెబుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఈటల ఏమన్నారంటే 22 మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఈనెలాఖరులోగా వాళ్ళంతా బీజేపీలో చేరుతారని చెప్పారు. ఈనెలాఖరులోగా చేరుతారనేందుకు ముహూర్తం ఏమిటి ? ఏమిటంటే 27వ తేదీన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాకు వస్తున్నారు. ఎంతో కాలంగా వాయిదాలు పడుతున్న ఖమ్మం బహిరంగసభ జరగబోతోంది.
అమిత్ తెలంగాణా రాకసందర్భంగా 22 మంది పెద్దనేతలు బీజేపీలో చేరటానికి రంగం సిద్ధమైందని ఈటల అన్నారు. 22 మంది నేతలు ఎవరు ? ఏ పార్టీలో నుండి వస్తున్నారు ? అన్న విషయాన్ని చెప్పలేదు. బీజేపీ టార్గెట్ అంతా బీఆర్ఎస్సే కాబట్టి అధికారపార్టీలో నుండి రావచ్చనే చర్చ పెరిగిపోతోంది. వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరబోతున్న వాళ్ళ వివరాలను రహస్యంగా ఉంచినట్లు ఈటల చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ అంతమంది బీజేపీలో చేరటం నిజమేనా అనే డౌటు పెరిగిపోతోంది.
ఎందుకంటే ఇపుడు తెలంగాణా రాజకీయమంతా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగానే ఉంటోంది. ఒకపుడు బీజేపీకి మంచి ఊపుండేది కానీ కొద్దినెలలుగా పార్టీ చప్పబడిపోయింది. ఎప్పుడైతే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందో అప్పటినుండే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కు ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రముఖులు అనుకున్న చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. దాంతో బీజేపీ బాగా వెనకబడిపోయింది.
నిజానికి మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటారని అనుకునేంతమంది అభ్యర్ధులు 40 నియోజకవర్గాల్లో ఉంటే చాలా గొప్ప. సంస్ధాగతంగా బలపడలేదు, నేతలను చూసినా బలమైన వాళ్ళు చాలా తక్కువ, అధికారంలోకి వస్తుందన్న నమ్మకమూ లేదు. పైగా పార్టీకి ఊపుతెచ్చిన బండి సంజయ్ ను తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. ఈ పరిస్ధితుల్లో బీజేపీలో 22 మంది నేతలు ఎందుకు చేరుతారు అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈటల ఏదో గాలిమాటలు చెప్పే రకంకాదని అందరికీ తెలుసు. మరి నెలాఖరులో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on August 19, 2023 9:56 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…