ఎంతటి నాయకులైనా.. గతం తాలూకు అనుభవాలను, లెక్కలను తరచుగా పరిశీలించుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి తేడా లేదు. గతం అనేక పాఠాలు, లెక్కలు నేర్పిస్తుందని అంటారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 2019 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మననం చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. దాని తాలూకు పాఠాలను ప్రస్తుత కాలానికి వర్తింప జేయాలనే సూచనలు కూడా వస్తున్నాయి.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ.. ఎన్నికలను సరైన విధంగా డీల్ చేయలేకపోయారనే వాదన టీడీపీలోనే వినిపించింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించే బాద్యతను సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు వేసుకున్నారు. అంతేకాదు.. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికీ వెళ్లి.. తన వాళ్లను గెలిపించాలని విన్నవించారు. తన నేతలు తప్పు చేస్తే.. ఈ ఒక్కసారికీ తనను చూసి ఓటేయాలని వంగి వంగి మరీ దణ్ణాలు పెట్టారు.
అయినప్పటికీ.. ప్రజలకు-టీడీపీకి మధ్య కెమిస్ట్రీ పండలేదు. కట్ చేస్తే.. సేమ్ టు సేమ్.. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి నియోజవకర్గంలోనూ చంద్రబాబే బాధ్యత తీసుకుంటున్నారని.. కానీ, స్థానిక నేతకు ఎందుకు బాధ్యత అప్పగించడం లేదనేది పరిశీలకుల ప్రశ్న. స్థానికంగా ఉన్న నాయకుడిని చూసే ప్రజలు ఓటేస్తారని.. ఆ నాయకుడిలో ఏ చిన్న తేడా వున్నా.. కష్టమేనని అంటున్నారు.
ఇలాంటి కీలక ఎన్నికల సమయంలో మెజారిటీ వర్గంగా నాయకులను ముందు దింపి.. చంద్రబాబు రథం నడిపిస్తే.. బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. గత ఎన్నికల మాదిరిగా చంద్రబాబును చూసి ఓటే యాలని ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నారని, ఇలా కాకుండా.. తన నాయకులకు బాధ్యతలు అప్పగించి.. పార్టీని గెలిపించి తీసుకురావాలనే షరతును వారికే అప్పగిస్తే.. బెటర్ అని.. తద్వారా పార్టీపై నాయకుల బాధ్యత పెరిగి.. మరింత దూకుడుతో పార్టీ ముందుకు సాగుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 19, 2023 3:32 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…