ఎంతటి నాయకులైనా.. గతం తాలూకు అనుభవాలను, లెక్కలను తరచుగా పరిశీలించుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి తేడా లేదు. గతం అనేక పాఠాలు, లెక్కలు నేర్పిస్తుందని అంటారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 2019 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మననం చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. దాని తాలూకు పాఠాలను ప్రస్తుత కాలానికి వర్తింప జేయాలనే సూచనలు కూడా వస్తున్నాయి.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ.. ఎన్నికలను సరైన విధంగా డీల్ చేయలేకపోయారనే వాదన టీడీపీలోనే వినిపించింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించే బాద్యతను సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు వేసుకున్నారు. అంతేకాదు.. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికీ వెళ్లి.. తన వాళ్లను గెలిపించాలని విన్నవించారు. తన నేతలు తప్పు చేస్తే.. ఈ ఒక్కసారికీ తనను చూసి ఓటేయాలని వంగి వంగి మరీ దణ్ణాలు పెట్టారు.
అయినప్పటికీ.. ప్రజలకు-టీడీపీకి మధ్య కెమిస్ట్రీ పండలేదు. కట్ చేస్తే.. సేమ్ టు సేమ్.. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి నియోజవకర్గంలోనూ చంద్రబాబే బాధ్యత తీసుకుంటున్నారని.. కానీ, స్థానిక నేతకు ఎందుకు బాధ్యత అప్పగించడం లేదనేది పరిశీలకుల ప్రశ్న. స్థానికంగా ఉన్న నాయకుడిని చూసే ప్రజలు ఓటేస్తారని.. ఆ నాయకుడిలో ఏ చిన్న తేడా వున్నా.. కష్టమేనని అంటున్నారు.
ఇలాంటి కీలక ఎన్నికల సమయంలో మెజారిటీ వర్గంగా నాయకులను ముందు దింపి.. చంద్రబాబు రథం నడిపిస్తే.. బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. గత ఎన్నికల మాదిరిగా చంద్రబాబును చూసి ఓటే యాలని ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నారని, ఇలా కాకుండా.. తన నాయకులకు బాధ్యతలు అప్పగించి.. పార్టీని గెలిపించి తీసుకురావాలనే షరతును వారికే అప్పగిస్తే.. బెటర్ అని.. తద్వారా పార్టీపై నాయకుల బాధ్యత పెరిగి.. మరింత దూకుడుతో పార్టీ ముందుకు సాగుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 19, 2023 3:32 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…