బీఆర్ఎస్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ పై విమర్శలు చేసి.. పార్టీ నుంచి బయటకు వెళ్లారు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూరులో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్లో చేరాలనుకున్నారు. కానీ అది వీలు కాలేదు. చివరకు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొల్లాపూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాకుండా తన అనుచరులకూ టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు జూపల్లికి నాగం జనార్ధన్ రెడ్డి ఎదురు తిరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఒక్కసారిగా ఫైరయ్యారు. జూపల్లిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నానని మాజీ మంత్రి కూడా అయిన నాగం పేర్కొన్నారు. అలాగే కొల్లాపూరులోనూ నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అక్కడి నాయకులు కాపాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు జూపల్లి వచ్చి అయిదు సీట్లు కావాలని అడిగడం సరికాదని నాగం అసహనం వ్యక్తం చేశారు.
కొత్తగా కాంగ్రెస్లో చేరిన జూపల్లి కోసం ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న నాయకులకు అన్యాయం చేయొద్దనే ఉద్దేశంతో నాగం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూరుతో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల తదితర అయిదు నియోజకవర్గాల్లో తన అనుచరల కోసం సీట్లు కావాలని జూపల్లి అడుగుతున్నారని నాగం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోకవర్గం నుంచి పోటీ చేసిన నాగం జనార్ధన్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడారు. ఈ సారి పోటీపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని నాగం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్లో చక్రం తిప్పుదామనుకున్న జూపల్లి ఆశలకు నాగం అడ్డుగా నిలుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 19, 2023 9:50 am
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…
ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…