Political News

పోసానిపై కేసు.. లోకేష్ వాంగ్మూలం

యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలను అధికారంలోకి వచ్చాక తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా అలాంటి కేసు విషయంలోనే నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణముర‌ళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు.

వైసీపీకి మద్దతుగా నిలిచే పోసాని టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్ష‌మాప‌ణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోసానిపై కోర్టులో లోకేష్ కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగానే వాంగ్మూలాన్ని సమర్పించారు. పార్టీ జోలికి కానీ తమ జోలికి కానీ ఎవరైనా వస్తే విడిచి పెట్టేదే లేదంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 19, 2023 6:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

46 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago