Political News

పోసానిపై కేసు.. లోకేష్ వాంగ్మూలం

యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలను అధికారంలోకి వచ్చాక తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా అలాంటి కేసు విషయంలోనే నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణముర‌ళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు.

వైసీపీకి మద్దతుగా నిలిచే పోసాని టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్ష‌మాప‌ణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోసానిపై కోర్టులో లోకేష్ కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగానే వాంగ్మూలాన్ని సమర్పించారు. పార్టీ జోలికి కానీ తమ జోలికి కానీ ఎవరైనా వస్తే విడిచి పెట్టేదే లేదంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago