Political News

పోసానిపై కేసు.. లోకేష్ వాంగ్మూలం

యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలను అధికారంలోకి వచ్చాక తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా అలాంటి కేసు విషయంలోనే నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణముర‌ళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు.

వైసీపీకి మద్దతుగా నిలిచే పోసాని టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్ష‌మాప‌ణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు.

అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోసానిపై కోర్టులో లోకేష్ కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగానే వాంగ్మూలాన్ని సమర్పించారు. పార్టీ జోలికి కానీ తమ జోలికి కానీ ఎవరైనా వస్తే విడిచి పెట్టేదే లేదంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 19, 2023 6:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

10 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

10 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

12 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

12 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

17 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

18 hours ago