Political News

ఈసారి ఎలాగైనా గెలుస్తామంటూ లోకేష్‌ ధీమా!

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్‌ గట్టిగానే ఉన్నారు. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెదుకోవాలి అనే సామెతను ఆయన ఒంటపట్టించుకున్నారు. అందుకే ఆయన మంగళగిరి మీద గట్టి ఫోకస్‌ పెట్టినట్లుగానే కనిపిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుంతుందని ఆయన ధీమాగా ఉన్నారు.

తన తండ్రే నెక్ట్స్‌ సీఎం అంటూ లోకేష్‌ ఫిక్స్‌ అయినట్లే కనిపిస్తుంది. అటు టీడీపీ అధిష్టానం కూడా లోకేష్‌ గెలిచి అసెంబ్లీకి రావాలని గట్టి వ్యూహాలను పన్నుతుంది. కానీ మంగళగిరి టిక్కెట్టు అనేది టీడీపీకి హోప్‌ లేని నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గట్టి స్థానం ప్రస్తుత అధికార పార్టీదే.

అక్కడ బలమున్న నాయకులను వైసీపీలోకి ఎప్పుడో లాగేసుకున్నారు. వారిని పార్టీ నుంచి కదలకుండా చేసేందుకు ఉన్నత పదవులు కూడా కట్టబెట్టేసింది. దీంతో పాటు అక్కడ బాగా ఓట్లు పడతాయి అనుకున్న వర్గానికి అధిక మొత్తంలో సాయం చేస్తూ పేరు తెచ్చుసుకుంది కూడా. అందుకే ఈసారి కూడా గెలిచేసి ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేసేద్దాం అనుకుంటుంది అధికార పార్టీ.

కానీ ఇక్కడ వైసీపీకి వ్యతిరేక చర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు. అలాగే ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌తో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంద‌ని, కావున ఎలాగైనా ఈ సారి గెలుస్తాన‌ని లోకేశ్ ధీమాగా వున్నారు. ఆయన శుక్రవారం కూడా మీడియాతో మాట్లాడుతూ.. మ‌రోసారి ఇక్క‌డే పోటీ చేస్తాన‌ని, భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని చెప్పుకొచ్చారు. అభివృద్ధే చేయ‌ని వైసీపీని జ‌నం ఆద‌రించ‌ర‌న్నారు.

This post was last modified on August 18, 2023 7:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

57 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago