వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్ గట్టిగానే ఉన్నారు. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెదుకోవాలి అనే సామెతను ఆయన ఒంటపట్టించుకున్నారు. అందుకే ఆయన మంగళగిరి మీద గట్టి ఫోకస్ పెట్టినట్లుగానే కనిపిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుంతుందని ఆయన ధీమాగా ఉన్నారు.
తన తండ్రే నెక్ట్స్ సీఎం అంటూ లోకేష్ ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. అటు టీడీపీ అధిష్టానం కూడా లోకేష్ గెలిచి అసెంబ్లీకి రావాలని గట్టి వ్యూహాలను పన్నుతుంది. కానీ మంగళగిరి టిక్కెట్టు అనేది టీడీపీకి హోప్ లేని నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గట్టి స్థానం ప్రస్తుత అధికార పార్టీదే.
అక్కడ బలమున్న నాయకులను వైసీపీలోకి ఎప్పుడో లాగేసుకున్నారు. వారిని పార్టీ నుంచి కదలకుండా చేసేందుకు ఉన్నత పదవులు కూడా కట్టబెట్టేసింది. దీంతో పాటు అక్కడ బాగా ఓట్లు పడతాయి అనుకున్న వర్గానికి అధిక మొత్తంలో సాయం చేస్తూ పేరు తెచ్చుసుకుంది కూడా. అందుకే ఈసారి కూడా గెలిచేసి ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేసేద్దాం అనుకుంటుంది అధికార పార్టీ.
కానీ ఇక్కడ వైసీపీకి వ్యతిరేక చర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు. అలాగే ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటోందని, కావున ఎలాగైనా ఈ సారి గెలుస్తానని లోకేశ్ ధీమాగా వున్నారు. ఆయన శుక్రవారం కూడా మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి ఇక్కడే పోటీ చేస్తానని, భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. అభివృద్ధే చేయని వైసీపీని జనం ఆదరించరన్నారు.
This post was last modified on August 18, 2023 7:16 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…