Political News

రిపోర్ట్ – జులైలో పోయిన ఉద్యోగాలు 50 లక్షలు !

అగ్రరాజ్యం అమెరికా మొదలు అభివృద్ధి చెందుతోన్న భారత్ వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అధ:పాతాళానికి పోయాయి. 2008 ఆర్థిక మాంద్యం కన్నా కరోనాతో రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే జీడీపీ పడిపోయి నానా తిప్పలు పడుతోన్న భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా పెను ప్రభావం చూపిందని చెబుతున్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఈ ఏడాది మొత్తం కొనసాగుతాయని అంటున్నారు. ఇక, కరోనాతో అనివార్యమైన లాక్ డౌన్ వల్ల ఒక్క జులై నెలలోనే దాదాపు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు భారత్ లో దాదాపు 1.8 కోట్ల మది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ప్రకటించింది.

లాక్ డౌన్ దెబ్బకు బడా కంపెనీలు మొదలు చిన్నా చితక కంపెనీల వరకు అన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలామంది ఉద్యోగులను తొలగించాయి. చిన్నా చితకా కంపెనీలు కరోనా దెబ్బకు మూతబడ్డాయి. ఈ క్రమంలోనే గడచిన నాలుగు నెలల్లో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ వెల్లడించింది. నెలసరి జీతం పొందే ఉద్యోగాలు దేశ జీడీపీకి ఊతమిస్తాయని, ఈ ఉద్యోగాల కోత జీడీపీపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది.

గ్రామీణ, నగర ఉపాధిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. అన్ లాకింగ్ లోనూ కొత్త నియామకాలు మందకొడిగా సాగడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జులైలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు తమ ఖర్చులను చాలావరకు తగ్గించుకున్నారని, ఉద్యోగాల కల్పన పరిస్థితిలో మార్పు రాకుంటే ఈ ప్రభావం గ్రామీణ ఎకానమీపై పడుతుందని హెచ్చరించింది. నెలసరి జీతాలిచ్చే ఉద్యోగాల కల్పనలో వృద్ధి లేకుంటే ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని వార్నింగ్ ఇచ్చింది.

This post was last modified on August 19, 2020 3:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago