కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీమంత్రి చంద్రశేఖర్ ఎక్కడి నుండి పోటీచేయబోతున్నారు ? ఇపుడిదే చర్చ కాంగ్రెస్ లో పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రశేఖర్ ది వికారాబాద్ నియోజకవర్గం. అయితే అక్కడ పోటీచేయటానికి అవకాశంలేదు. ఎందుకంటే అక్కడ మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, బలమైన అభ్యర్ధి గడ్డం ప్రసాదరావు ఉన్నారు. కాబట్టి ప్రసాద్ ను కదల్చటం సాధ్యంకాదు. కాబట్టి వికారాబాద్ లో టికెట్ సాధ్యంకాదని పార్టీ అధిష్టానం ముందుగానే చంద్రశేఖర్ కు చెప్పేసింది. అందుకు బదులుగా చేవెళ్ళ లేదా జహీరాబాద్ టికెట్ ఇస్తామని చెప్పింది.
అధిష్ఠానం సమాచారాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టంగా మాజీమంత్రికి చేరవేశారు. చేవెళ్ళ లేదా జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని అధిష్టానమే నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. అందుకు మాజీమంత్రి అంగీకరించారు. ఎక్కువభాగం జహీరాబాద్ నియోజకవర్గమే చంద్రశేఖర్ కు కేటాయించే అవకాశాలున్నాయనే టాక్ వినబడుతోంది. ఈ మాజీమంత్రి బీజేపీలో నుండి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
నిజానికి చంద్రశేఖర్ వికారాబాద్ నియోజకవర్గంలో బాగా పట్టున్న నేతనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశంపార్టీ తరపున 1985 నుండి 2004 ఎన్నికల వరకు ఏకబిగిన ఐదుసార్లు వరుసగా గెలిచారు. తర్వాత రాజకీయం కాస్త గాడితప్పింది. దానికితోడు రాష్ట్ర విభజన కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. అందుకనే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి తర్వాత రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
అయితే అక్కడ చంద్రశేఖర్ సేవలను పార్టీ ఏ విధంగా కూడా వినియోగించుకోలేదు. అందుకనే ఇక లాభంలేదని రాజీనామా చేసేశారు. రెండురోజుల్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఒకవిధంగా చంద్రశేఖర్ చేరిక కాంగ్రెస్ పార్టీకి బలమవుతుందనే అనుకుంటున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా చేవెళ్ళే లేదా జహీరాబాద్ నియోజకవర్గాల్లో దేన్ని కేటాయించాలనే విషయమై అధిష్టానమే నిర్ణయిస్తుందని ముందుజాగ్రత్తలు తీసుకుంది. అందుకనే మాజీమంత్రి కూడా అంగీకరించారు. సరే ఏదేమైనా ఎక్కడో ఒకచోట నుండి టికెట్ అయితే ఖాయం. మరి భవిష్యత్తు ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on August 17, 2023 7:28 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…