దివంగత వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం రాజకీయ పరంగానూ చర్చకు దారి తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతలా అంటే ఈ పెళ్లితో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏమిటీ అంటే?
నరసాపురానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. జక్కం బాబ్జి, అమ్మాని దంపతుల రెండో అమ్మాయి పుష్పవల్లి.. రాధాకు భార్య కాబోతున్నారు. ఈ కుటుంబానికి రాజకీయంగా మంచి పేరే ఉంది. రాధాకు కాబోయే అత్త 1987లో టీడీపీ నుంచి నరసాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా పని చేశారు.
కానీ ఇప్పుడు రాధా మామగారి కుటుంబం జనసేనలో యాక్టివ్గా ఉంది. ఇటీవల ఉభయ గోదావవరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ వీళ్ల ఇంట్లోనే బస చేశారు. మరోవైపు వంగవీటి రంగా జయంతి సందర్భంగా రాధా కూడా బాబ్జి నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధా జనసేనతోనూ కలిసి తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిక కాబోయే మామ జనసేనలోనే ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత రాధా కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయనే చర్చ ఊపందుకుంది.
This post was last modified on August 17, 2023 3:40 pm
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…