దివంగత వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం రాజకీయ పరంగానూ చర్చకు దారి తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతలా అంటే ఈ పెళ్లితో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏమిటీ అంటే?
నరసాపురానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. జక్కం బాబ్జి, అమ్మాని దంపతుల రెండో అమ్మాయి పుష్పవల్లి.. రాధాకు భార్య కాబోతున్నారు. ఈ కుటుంబానికి రాజకీయంగా మంచి పేరే ఉంది. రాధాకు కాబోయే అత్త 1987లో టీడీపీ నుంచి నరసాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా పని చేశారు.
కానీ ఇప్పుడు రాధా మామగారి కుటుంబం జనసేనలో యాక్టివ్గా ఉంది. ఇటీవల ఉభయ గోదావవరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ వీళ్ల ఇంట్లోనే బస చేశారు. మరోవైపు వంగవీటి రంగా జయంతి సందర్భంగా రాధా కూడా బాబ్జి నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధా జనసేనతోనూ కలిసి తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిక కాబోయే మామ జనసేనలోనే ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత రాధా కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయనే చర్చ ఊపందుకుంది.
This post was last modified on August 17, 2023 3:40 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…