దివంగత వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం రాజకీయ పరంగానూ చర్చకు దారి తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతలా అంటే ఈ పెళ్లితో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏమిటీ అంటే?
నరసాపురానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. జక్కం బాబ్జి, అమ్మాని దంపతుల రెండో అమ్మాయి పుష్పవల్లి.. రాధాకు భార్య కాబోతున్నారు. ఈ కుటుంబానికి రాజకీయంగా మంచి పేరే ఉంది. రాధాకు కాబోయే అత్త 1987లో టీడీపీ నుంచి నరసాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా పని చేశారు.
కానీ ఇప్పుడు రాధా మామగారి కుటుంబం జనసేనలో యాక్టివ్గా ఉంది. ఇటీవల ఉభయ గోదావవరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ వీళ్ల ఇంట్లోనే బస చేశారు. మరోవైపు వంగవీటి రంగా జయంతి సందర్భంగా రాధా కూడా బాబ్జి నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధా జనసేనతోనూ కలిసి తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిక కాబోయే మామ జనసేనలోనే ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత రాధా కూడా జనసేనలో చేరే అవకాశాలున్నాయనే చర్చ ఊపందుకుంది.
This post was last modified on August 17, 2023 3:40 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…