దసరాపండుగ సమయానికి తొలిజాబితాగా 50 మంది అభ్యర్ధుల పేర్లను మాత్రమే ప్రకటించాలని చంద్రబాబునాయుడు అనుకున్నారట. మొదట్లో మొదటి జాబితాలో 70-80 నియోజకవర్గాలను ప్రకటించాలని అనుకున్నారు. అయితే తాజా పరిస్ధితుల కారణంగా ఆ నెంబర్ ను తగ్గించేశారట. ఇపుడు అనుకుంటున్న 50 మందిలో కూడా 19 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలే ఉంటారు. వీళ్ళుకాకుండా మరో 31 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితా రెడీ అవుతోందట. ఎలాంటి వివాదాలు లేని, సీనియర్లకు పోటీలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ 31 మందిని ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారట.
పార్టీ తరపున థర్డ్ పార్టీగా రెండు సంస్ధలతో ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. అలాగే రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎలాగూ తన బృందంతో రెగ్యులర్ గా సర్వేలు చేస్తునే ఉన్నారు. అన్నింటినీ సమప్ చేసి సర్వే రిపోర్టులను విశ్లేషిస్తున్నారు. తాను చేస్తున్న పర్యటనల ఫీడ్ బ్యాక్, లోకేష్ యువగళం పీడ్ బ్యాక్ రెండింటిపైనా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకుంటున్నారు.
వీటికి అదనంగా నియోజకవర్గాల ఇన్చార్జిలతో తరచూ సమావేశమవుతున్నారు. అంటే రకరకా మార్గాల్లో గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకోవటంలో చంద్రబాబు చాలా బిజీగా ఉంటున్నారు. ఇన్ని మార్గాల్లో రిపోర్టులు తెప్పించుకున్న తర్వాతే మొదటిజాబితాగా 50 మంది అభ్యర్ధులను ప్రకటించాలని అనుకున్నారట. మరి మిగితా అభ్యర్దులను ఎప్పుడు ప్రకటిస్తారు ? ఎప్పుడంటే పొత్తుల విషయం ఫైనల్ అయిన తర్వాతే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
జనసేనతో పొత్తుంటుందని ఒకసారి ఉండదని మరోసారి అనిపిస్తోంది. జనసేనతో పాటు బీజేపీ పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదు. పొత్తుపెట్టుకుంటే లాభమా ? లేకపోతే ఒంటరిగా పోటీచేస్తేనే లాభమా అన్న విషయంలో బాగా అయోమయం కనబడుతోంది. కొందరు తమ్ముళ్ళేమో అసలు రెండుపార్టీలతోను పొత్తు వద్దని పదేపదే చెబుతున్నారు. దాంతో పొత్తుల అంశం బాగా అయోమయం పెంచేస్తోంది. అందుకనే మొదటిజాబితాలో కేవలం 50 మంది అభ్యర్ధులను మాత్రమే ప్రకటించాలని అనుకున్నారట. మొదటిజాబితాను ప్రకటించేస్తే ప్రత్యర్ధిపార్టీలపై ఆటోమేటిగ్గా ఒత్తిడి మొదలైపోతుంది. అప్పుడు పొత్తుల విషయం ఫైనల్ అవుతుందని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 17, 2023 1:42 pm
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…