మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల పోటీచేస్తే, కాంగ్రెస్ అభ్యర్ధిగా సబిత పోటీచేశారు.
హోరాహోరీగా జరిగిన పోరులో సబిత గెలిచారు. ఇక్కడవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో సబిత బీఆర్ఎస్ లో చేరారు. చేరటమే కాకుండా ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. అప్పటినుండి తీగలకు ఇబ్బందులు మొదలయ్యాయి. సరే ఏదో విధంగా నాలుగున్నరేళ్ళు నెట్టుకొచ్చేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయంలో కేసీయార్ కు సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరూ టికెట్ తమకే దక్కాలంటే కాదు తమకే అంటు పట్టుదలగా ఉన్నారు.
దాంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. అయితే సడెన్ గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల భేటీ అయ్యారనే విషయం బయటకుపొక్కింది. అయితే ఆ తర్వాత అది నిజమే అని నిర్ధారణ కూడా అయ్యింది. తీగలను వదులుకునే ఉద్దేశ్యంలో కేసీయార్ లేరు. ఎందుకంటే తీగలకు బలమైన మద్దతుదారులున్నారు. క్షేత్రస్ధాయిలో బలమైనపట్టుంది.
తీగల సహకారం లేకపోతే సబిత గెలుపు కష్టమే. అందుకనే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోమని చెప్పినట్లున్నారు. కారణం ఏదైనా ఇద్దరి భేటీ జరిగింది. భేటీలో ఏమి మాట్లాడుకున్నారో బయటకు తెలీటంలేదు. అయితే భేటీ జరిగిన తర్వాత కూడా ఇద్దరు ఎడమొహం పెడమొహంలాగే వ్యవహరిస్తున్నారు. దాంతో తీగల ఎక్కువరోజులు బీఆర్ఎస్ లో ఉండరనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తీగల పోటీచేస్తే తన పరిస్దితి ఏమిటనే విషయంలో సబిత టెన్షన్ పడుతున్నారట. అసలే కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం తెలిసిందే. అందుకనే గెలుపుపై సబితలో టెన్షన్ పెరిగిపోతోందట.
This post was last modified on August 17, 2023 11:16 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…