Political News

రికార్డు సరే… షర్మిలకు ఏంటి లాభం ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు.

వివిధ కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడినా మళ్ళీ మొదలుపెట్టారు. పాదయాత్ర చేయడం ద్వారా షర్మిల ఫిజికల్, మెంటల్ స్టామినా అందరికీ అర్థమైంది. అయితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగముందా ? అన్నదే ప్రశ్న. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జనాల్లో పెద్దగా రిజిస్టర్ కాలేదు. పార్టీ పెట్టి సుమారు రెండేళ్ళవుతున్నా జనాలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా గుర్తించటంలేదు.

పార్టీపెట్టి రెండేళ్ళవుతున్నా ఇంకా ఉనికి చాటుకోవటం కోసమే షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. ఎంతకాలం గడచినా ఎలాంటి ఉపయోగం ఉండదనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేయాలని హస్తంపార్టీ నేతలు ప్రతిపాదించారు. దీనికి షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తనకు దక్కబోయే హోదా, పోటీచేయబోయే స్ధానం లాంటి చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడం ఖాయం. ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీకో లేకపోతే సికింద్రాబాద్ ఎంపీగానో పోటీ చేస్తారు. ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మరెన్ని పాదయాత్రలు చేసినా షర్మిలకు దక్కబోయే ప్రజామద్దతుపైన అనుమానంగానే ఉంది. ప్రజామద్దతు లేనపుడు ఎన్ని విన్యాసాలు చేసినా ఉపయోగముండదు. ఇండియన్ బుక్ ఆఫ రికార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఇదికూడా సరిపోదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి పేరు చేరుతుందంతే.

This post was last modified on August 16, 2023 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

7 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

36 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago