Political News

రికార్డు సరే… షర్మిలకు ఏంటి లాభం ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు.

వివిధ కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడినా మళ్ళీ మొదలుపెట్టారు. పాదయాత్ర చేయడం ద్వారా షర్మిల ఫిజికల్, మెంటల్ స్టామినా అందరికీ అర్థమైంది. అయితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగముందా ? అన్నదే ప్రశ్న. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జనాల్లో పెద్దగా రిజిస్టర్ కాలేదు. పార్టీ పెట్టి సుమారు రెండేళ్ళవుతున్నా జనాలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా గుర్తించటంలేదు.

పార్టీపెట్టి రెండేళ్ళవుతున్నా ఇంకా ఉనికి చాటుకోవటం కోసమే షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. ఎంతకాలం గడచినా ఎలాంటి ఉపయోగం ఉండదనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేయాలని హస్తంపార్టీ నేతలు ప్రతిపాదించారు. దీనికి షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తనకు దక్కబోయే హోదా, పోటీచేయబోయే స్ధానం లాంటి చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడం ఖాయం. ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీకో లేకపోతే సికింద్రాబాద్ ఎంపీగానో పోటీ చేస్తారు. ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మరెన్ని పాదయాత్రలు చేసినా షర్మిలకు దక్కబోయే ప్రజామద్దతుపైన అనుమానంగానే ఉంది. ప్రజామద్దతు లేనపుడు ఎన్ని విన్యాసాలు చేసినా ఉపయోగముండదు. ఇండియన్ బుక్ ఆఫ రికార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఇదికూడా సరిపోదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి పేరు చేరుతుందంతే.

This post was last modified on August 16, 2023 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

1 minute ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

2 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

3 hours ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

3 hours ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

3 hours ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

4 hours ago