వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు.
వివిధ కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడినా మళ్ళీ మొదలుపెట్టారు. పాదయాత్ర చేయడం ద్వారా షర్మిల ఫిజికల్, మెంటల్ స్టామినా అందరికీ అర్థమైంది. అయితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగముందా ? అన్నదే ప్రశ్న. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జనాల్లో పెద్దగా రిజిస్టర్ కాలేదు. పార్టీ పెట్టి సుమారు రెండేళ్ళవుతున్నా జనాలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా గుర్తించటంలేదు.
పార్టీపెట్టి రెండేళ్ళవుతున్నా ఇంకా ఉనికి చాటుకోవటం కోసమే షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. ఎంతకాలం గడచినా ఎలాంటి ఉపయోగం ఉండదనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేయాలని హస్తంపార్టీ నేతలు ప్రతిపాదించారు. దీనికి షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తనకు దక్కబోయే హోదా, పోటీచేయబోయే స్ధానం లాంటి చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడం ఖాయం. ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీకో లేకపోతే సికింద్రాబాద్ ఎంపీగానో పోటీ చేస్తారు. ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మరెన్ని పాదయాత్రలు చేసినా షర్మిలకు దక్కబోయే ప్రజామద్దతుపైన అనుమానంగానే ఉంది. ప్రజామద్దతు లేనపుడు ఎన్ని విన్యాసాలు చేసినా ఉపయోగముండదు. ఇండియన్ బుక్ ఆఫ రికార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఇదికూడా సరిపోదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి పేరు చేరుతుందంతే.
This post was last modified on August 16, 2023 1:10 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…