Political News

కేసీయార్ ఎందుకు తప్పుకున్నారు ?

ఇపుడి విషయంపైనే ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలనుండి కేసీయార్ తప్పుకున్నారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకరరరావుకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టు నియమ, నిబంధనలకు కేసీఆర్ నిర్ణయం విరుద్ధం. అయినా సరే ఎందుకు తప్పుకున్నారు ? ఎందుకని డాక్టర్ సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు ? ఆరోగ్యశ్రీ ట్రస్టు ఏర్పాటైన దగ్గర నుండి ముఖ్యమంత్రి మాత్రమే ఛైర్మన్ గా ఉన్నారు.

సమైక్య రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణలో అయినా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీయార్ మాత్రమే ట్రస్టు ఛైర్మన్ గా వ్యవహరించారు. అలాంటిది ట్రస్టు నియమ, నిబంధలను ప్రక్షాళన చేసి, ట్రస్టు బైలాస్ ను పునర్ వ్యవస్ధీకరించింది ప్రభుత్వం. సుధాకర్ ను ఛైర్మన్ గా చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనిచేసిందనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రస్టు తరఫున ఏదన్నా కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే మామూలు వ్యక్తులకు అవకాశం లేదు. ట్రస్టు తరపున నిర్ణయం తీసుకున్నా దాని ఆమోదం కోసం మళ్ళీ ఫైలును ముఖ్యమంత్రికి పంపాల్సిందే. అదే ముఖ్యమంత్రే ఛైర్మన్ గా ఉంటే ట్రస్టు సమావేశంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని డైరెక్టుగా అమల్లోకి తెచ్చేయచ్చు.

ఈ ఉద్దేశ్యంతోనే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కేసీయార్ కూడా ఛైర్మన్ గా ఉన్నారు. అలాంటిది సడెన్ గా మొత్తం బైలాస్ ను ఎందుకు మార్చారు ? సుధాకర్ ను ఎందుకు ఛైర్మన్ గా నియమించారో అర్ధంకావటంలేదు. ప్రభుత్వం చేసిన పనివల్ల ఏమైందంటే మంత్రులు, ఎంఎల్ఏలు చేసే సిఫారసులు ఆమోదం పొందాలంటే ఛైర్మన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి చుట్టు తిరగమంటే తిరుగుతారు. మరిపుడు ఛైర్మన్ చుట్టూ కూడా తిరగాలంటే మంత్రులు, ఎంఎల్ఏలకు కాస్త ఇబ్బందే. మొన్నటివరకు వరంగల్లో డాక్టర్ గా పనిచేసిన సుధాకర్ ను ఛైర్మన్ చేయటంతో తలెత్తబోయే సమస్యిది.

This post was last modified on August 16, 2023 12:08 pm

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

29 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

10 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago