ఇపుడి విషయంపైనే ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలనుండి కేసీయార్ తప్పుకున్నారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకరరరావుకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టు నియమ, నిబంధనలకు కేసీఆర్ నిర్ణయం విరుద్ధం. అయినా సరే ఎందుకు తప్పుకున్నారు ? ఎందుకని డాక్టర్ సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు ? ఆరోగ్యశ్రీ ట్రస్టు ఏర్పాటైన దగ్గర నుండి ముఖ్యమంత్రి మాత్రమే ఛైర్మన్ గా ఉన్నారు.
సమైక్య రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణలో అయినా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీయార్ మాత్రమే ట్రస్టు ఛైర్మన్ గా వ్యవహరించారు. అలాంటిది ట్రస్టు నియమ, నిబంధలను ప్రక్షాళన చేసి, ట్రస్టు బైలాస్ ను పునర్ వ్యవస్ధీకరించింది ప్రభుత్వం. సుధాకర్ ను ఛైర్మన్ గా చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనిచేసిందనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రస్టు తరఫున ఏదన్నా కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే మామూలు వ్యక్తులకు అవకాశం లేదు. ట్రస్టు తరపున నిర్ణయం తీసుకున్నా దాని ఆమోదం కోసం మళ్ళీ ఫైలును ముఖ్యమంత్రికి పంపాల్సిందే. అదే ముఖ్యమంత్రే ఛైర్మన్ గా ఉంటే ట్రస్టు సమావేశంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని డైరెక్టుగా అమల్లోకి తెచ్చేయచ్చు.
ఈ ఉద్దేశ్యంతోనే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కేసీయార్ కూడా ఛైర్మన్ గా ఉన్నారు. అలాంటిది సడెన్ గా మొత్తం బైలాస్ ను ఎందుకు మార్చారు ? సుధాకర్ ను ఎందుకు ఛైర్మన్ గా నియమించారో అర్ధంకావటంలేదు. ప్రభుత్వం చేసిన పనివల్ల ఏమైందంటే మంత్రులు, ఎంఎల్ఏలు చేసే సిఫారసులు ఆమోదం పొందాలంటే ఛైర్మన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి చుట్టు తిరగమంటే తిరుగుతారు. మరిపుడు ఛైర్మన్ చుట్టూ కూడా తిరగాలంటే మంత్రులు, ఎంఎల్ఏలకు కాస్త ఇబ్బందే. మొన్నటివరకు వరంగల్లో డాక్టర్ గా పనిచేసిన సుధాకర్ ను ఛైర్మన్ చేయటంతో తలెత్తబోయే సమస్యిది.
This post was last modified on August 16, 2023 12:08 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…