ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులతో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపణలతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు ఓ కండీషన్ పెట్టారని తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి టీడీపీ తరపున శ్రీదేవి పోటీ చేయాలని చూస్తున్నారు. అది కాకపోతే ప్రత్తిపాడు స్థానంలోనైనా ఛాన్స్ ఇవ్వాలని బాబును కోరుతున్నట్లు తెలిసింది.
కానీ తాడికొండలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు టీడీపీ తరపున టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ప్రత్తికొండలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు బాబు అవకాశం ఇస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని బాపట్ల లోక్సభ నియోజకవర్గం బరిలో దింపే ఆలోచనలో బాబు ఉన్నట్లు టాక్. అక్కడి నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్కు శ్రీదేవితో చెక్ పెట్టాలన్నది బాబు ప్లాన్గా కనిపిస్తోంది. మరి అందుకు శ్రీదేవి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
This post was last modified on August 16, 2023 11:05 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…