ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులతో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపణలతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు ఓ కండీషన్ పెట్టారని తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి టీడీపీ తరపున శ్రీదేవి పోటీ చేయాలని చూస్తున్నారు. అది కాకపోతే ప్రత్తిపాడు స్థానంలోనైనా ఛాన్స్ ఇవ్వాలని బాబును కోరుతున్నట్లు తెలిసింది.
కానీ తాడికొండలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు టీడీపీ తరపున టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ప్రత్తికొండలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు బాబు అవకాశం ఇస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని బాపట్ల లోక్సభ నియోజకవర్గం బరిలో దింపే ఆలోచనలో బాబు ఉన్నట్లు టాక్. అక్కడి నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్కు శ్రీదేవితో చెక్ పెట్టాలన్నది బాబు ప్లాన్గా కనిపిస్తోంది. మరి అందుకు శ్రీదేవి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
This post was last modified on August 16, 2023 11:05 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…