Political News

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు.

ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని చంద్ర‌బాబు అన్నారు. ఏపీని మరలా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది త‌న స్వ‌ప్న‌మ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రముఖపాత్ర యువకులదేనన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047 ను ఆవిష్కరించడం త‌న పూర్వజన్మ సుకృతంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే తాను విజన్ డాక్యుమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

2047లో కీల‌క విష‌యాలు..

  • అవినీతి ఇంకా పోలేదు. నేరాలు ఎక్కువయ్యాయి. ఈ రెండిటిని అదుపు చేస్తే అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.
  • ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించబడింది. కానీ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అయింది.
  • రానున్న 100 సంవత్సరాలు యువతదే.
  • తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది.
  • తెలుగు జాతి అన్ని రంగాలలో ముందు ఉండాలి.
  • రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.
  • ఒక దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది.
  • విశాఖ వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు.

This post was last modified on August 16, 2023 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

29 minutes ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

2 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

3 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

6 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

7 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

7 hours ago