Political News

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు.

ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని చంద్ర‌బాబు అన్నారు. ఏపీని మరలా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది త‌న స్వ‌ప్న‌మ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రముఖపాత్ర యువకులదేనన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047 ను ఆవిష్కరించడం త‌న పూర్వజన్మ సుకృతంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే తాను విజన్ డాక్యుమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

2047లో కీల‌క విష‌యాలు..

  • అవినీతి ఇంకా పోలేదు. నేరాలు ఎక్కువయ్యాయి. ఈ రెండిటిని అదుపు చేస్తే అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.
  • ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించబడింది. కానీ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అయింది.
  • రానున్న 100 సంవత్సరాలు యువతదే.
  • తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది.
  • తెలుగు జాతి అన్ని రంగాలలో ముందు ఉండాలి.
  • రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.
  • ఒక దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది.
  • విశాఖ వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు.

This post was last modified on August 16, 2023 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

9 minutes ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

4 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago