Political News

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు.

ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని చంద్ర‌బాబు అన్నారు. ఏపీని మరలా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది త‌న స్వ‌ప్న‌మ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రముఖపాత్ర యువకులదేనన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047 ను ఆవిష్కరించడం త‌న పూర్వజన్మ సుకృతంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే తాను విజన్ డాక్యుమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

2047లో కీల‌క విష‌యాలు..

  • అవినీతి ఇంకా పోలేదు. నేరాలు ఎక్కువయ్యాయి. ఈ రెండిటిని అదుపు చేస్తే అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.
  • ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించబడింది. కానీ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అయింది.
  • రానున్న 100 సంవత్సరాలు యువతదే.
  • తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది.
  • తెలుగు జాతి అన్ని రంగాలలో ముందు ఉండాలి.
  • రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.
  • ఒక దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది.
  • విశాఖ వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు.
Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

1 hour ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

1 hour ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

3 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

4 hours ago