Political News

టీడీపీలో నాయకులు లేరు.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై, జగన్ సర్కారుపై, పోలీసులపై, టీడీపీపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డిపై చిందులేసినందుకే గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు జేసీ. ఇక, టీడీపీలో కార్యకర్తలున్నారని, నాయకులు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా పోలీసును ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో అవమానిస్తే మాట్లాడే దిక్కే లేదా తెలుగుదేశానికి అని ప్రశ్నించారు. తానేమన్నా అంటే తనను పనికిమాలిన వాడు అని విమర్శిస్తారని షాకింగ్ కామెంట్లు చేశారు.

మహిళా పోలీసుకు అవమానం జరిగితే పోలీసు అసోసియేషన్ ఏం చేస్తోందని నిలదీశారు. సీఐ చనిపోతే పోలీసు అసోసియేషన్ రాదని..భయం అని మండిపడ్డారు .ఎక్కడకు పోయింది అసోసియేషన్..అని ప్రశ్నించారు. అదే, గతంలో…మా అన్న చిన్న మాట అనిందానికే…ఓ గోల చేసి ఒక సీఐ ఎంపీ అయ్యాడు.. అని గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇసుక రవాణాకు అనుమతివ్వాలని, లేకుంటే ఆపాలని జేసీ మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు.

ఇసుక రవాణాపై అధికారులు, పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే తోలుకుంటామని జగన్ సర్కారును జేసీ హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించి పోలీసులకు కమిషన్లు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. సీఐ..ఎస్సై…డీఎస్పీలకు ఏమన్నా భాగాలున్నాయా అని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నుంచి పెన్నానదిలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. తాడిపత్రిలో పుట్టడం తన అదృష్టమన్నారు జేసీ.

This post was last modified on August 16, 2023 9:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

59 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

1 hour ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

3 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

4 hours ago