ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు- జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా 30 లక్షల మంది పేదలకు ప్రభు త్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈవిషయంపై చాలా చోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఈ పథకం ప్రకటించడానికి ముందే.. రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొని.. ఈ పథకం ప్రకటించాక.. ఆయా భూములనే ప్రభుత్వానికి నాలుగింతల ధరను పెంచి విక్రయించారనే వాదన ఉంది.
సరే.. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను కూడా జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా సంపాయించుకుంటే ఎవరు మాత్రం గుర్తిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు.. కనీసం 50 కోట్లయినా.. వెనుకేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. కానీ, అలా చేయలేదని.. సీఎం జగన్ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు.. తాను మాత్రం ఎందుకు చేయకూడదని అనుకున్నానని బాలినేని వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గం ఒంగోలు పరిధిలో వచ్చే నెలలో 25 వేల మంది లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వను న్నట్టు బాలినేని చెప్పారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని సవాల్ విసిరారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం కూడా ప్రతిపక్షానికి ఇష్టం లేకుండా పోయిందన్నారు. అందుకే కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు.
‘‘పేదలకు పంచే ఇళ్ల పట్టాల పంపిణీలో నేను సంపాదించాలనుకుంటే రూ.500 కోట్లలో రూ.50 కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ, నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు’’ అని బాలినేని వ్యాఖ్యానించారు. వచ్చే 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని.. ఈ విషయంలో ఎలాంటి అపనమ్మకం అవసరం లేదని చెప్పారు. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని, పత్రికల వారు కూడా రాస్తున్నారని.. అవన్నీ అభూత కల్పనలేనని బాలినేని చెప్పారు.
This post was last modified on August 15, 2023 6:56 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…