తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా గురించే మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనవసరంగా వర్మతో పెట్టుకున్నారు. ఎవరెన్ని మాట్లాడినా, తిట్టినా వర్మ పట్టించుకోరు. తనను తిట్టేట్లుగా, తనపై ఆరోపణలు, విమర్వలు చేసేట్లుగా ప్రత్యర్ధులను వర్మ ఇంకా ఇంకా రెచ్చగొడుతునే ఉంటారని అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంట్రవర్సీల్లో ఉండటమే వర్మకు కావాల్సింది. అలాంటి వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం అనే సినిమాను తీస్తున్నారు.
తొందరలోనే షూటింగ్ పూర్తవ్వబోయే సినిమాలో జగన్ క్యారెక్టర్ పాజిటివ్ గా… చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు మరికొన్ని క్యారెక్టర్లను నెగిటివ్ గానే తీస్తారనటంలో సందేహంలేదు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు పాజిటివ్ ఇమేజి ఇవ్వటమే వర్మ టార్గెట్. ఈ విషయం తెలిసి టీడీపీ నేతలు ఎందుకని వర్మను అనవసరంగా కెలుకుతున్నారో అర్థం కావటంలేదు. దేవినేని లాంటి వాళ్ళు వర్మను పట్టించుకోకపోతే అసలు వ్యూహం అనే సినిమా గురించి పెద్దగా ప్రచారమే జరగదు.
అలాంటిది వర్మ తీయబోయే సినిమా గురించి తమ్ముళ్ళు పదేపదే మాట్లాడుతుండటంతో వ్యూహం సినిమాకు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారా అనే సందేహం పెరిగిపోతోంది. సినిమాలు చూసి పార్టీలకు లేదా నేతలకు జనాలు ఓట్లేసే రోజులు ఎప్పుడో పోయాయి. సినిమాలు, మీడియాలు పోయి సోషల్ మీడియా రాజ్యం ఏలుతోంది. ఇలాంటి సినిమాలు ఎవరి గురించి ఎవరు ఎన్ని సినిమాలు తీసినా జనాలు పట్టించుకోరు.
ఈ విషయం గతంలోనే చాలా సందర్భాల్లో నిరూపణ అయ్యింది. అయినా తమ్ముళ్ళు వర్మ తీస్తున్న వ్యూహం సినిమాపై రచ్చ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. టీడీపీ పట్టించుకోకపోతే వ్యూహం సినిమా రిలీజవుతుంది..పోయింది అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అలాకాకుండా పదేపదే దానిపై చర్చలు చేస్తు వర్మను చాలెంజులు చేయటం వల్ల సినిమా అంటే తమ్ముళ్ళు భయపడుతున్నారా అనే అనుమానం జనాల్లో మొదలవుతుంది. అప్పుడు సినిమాలో వర్మ ఏమి చూపించాడు అనేందుకైనా కొంతమంది సినిమాను చూస్తారు. ఇదంతా తమ్ముళ్ళకి అవసరమా ?
This post was last modified on August 15, 2023 3:47 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…