Political News

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జ‌గ‌న్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్ర‌ద‌ర్శించారు.  

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం“ అని జ‌గ‌న్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామ‌న్నారు.  ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీల‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగ‌మిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

This post was last modified on August 15, 2023 1:22 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

4 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

5 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

5 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

6 hours ago