Political News

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జ‌గ‌న్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్ర‌ద‌ర్శించారు.  

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం“ అని జ‌గ‌న్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామ‌న్నారు.  ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీల‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగ‌మిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

This post was last modified on August 15, 2023 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

2 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

3 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

3 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

3 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

3 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

4 hours ago