Political News

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జ‌గ‌న్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్ర‌ద‌ర్శించారు.  

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం“ అని జ‌గ‌న్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామ‌న్నారు.  ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీల‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగ‌మిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

Satya

Recent Posts

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

29 minutes ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

2 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

3 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

3 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

5 hours ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

6 hours ago