Political News

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జ‌గ‌న్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్ర‌ద‌ర్శించారు.  

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం“ అని జ‌గ‌న్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామ‌న్నారు.  ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీల‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగ‌మిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

This post was last modified on August 15, 2023 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago