Political News

వ‌రుస‌గా 10వ సారి.. మోడీ సాధించిన అరుదైన రికార్డు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క‌ ఎర్రకోట వేదికగా జ‌రిగిన‌ 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో వ‌ర‌సుగా ఆయ‌న ప‌దో సారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ త‌ర‌ఫున ఇద్ద‌రుప్ర‌ధానులు చేయ‌గా.. వీరిలో మోడీ ఒక్క‌రే ఇలా.. ప‌దోసారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం రికార్డుగా ఆ పార్టీ నేత‌లు అభివ‌ర్ణించారు.

ఇక‌, ఎర్రకోటపై జ‌రిగిన‌ వేడుకలను ప్ర‌త్య‌క్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ప్ర‌ధాని స్వ‌యంగా ఆహ్వానించారు. వీరిలో ఏపీ రాష్ట్రం నుంచి 10 మంది ఉండ‌డం విశేషం. ఇక‌, ఎన్నిక‌ల సంవ‌త్స‌రం కావ‌డంతో వీరి సంఖ్య‌ను మ‌రింత పెంచారు.  గత ఏడాదితో పోల్చితే… ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఈ కార్య‌క్ర‌మాన్ని తీర్చిదిద్ద‌డం గ‌మ‌నార్హం.

య‌థా ప్ర‌కారం..

ఇక‌, ఎర్ర‌కోట పై నుంచి ప్ర‌సంగించినా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. య‌థా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో 2014 వ సంవ‌త్స‌రం వ‌ర‌కు జ‌రిగిన పాల‌న ఒక ఎత్త‌యితే.. త‌ర్వాత‌.. ఈ దేశం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగింద‌న్నారు. విశ్వ మంతా ఒక్క‌టే అనే నినాదాన్ని భుజాన వేసుకుని.. ప్ర‌పంచానికి సైతం భార‌త్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. గ‌తంలో ఈ త‌ర‌హా ఆలోచ‌న పాల‌కుల‌కు రాలేద‌న్నారు.

ఇప్పుడు ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా.. భారతీయ పౌరుల‌కు ఎన‌లేని గుర్తింపు, ఆద‌ర‌ణ ల‌భిస్తున్నాయ ని, దీనికి 2014 త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు వేసిన అడుగులే కార‌ణ‌మ‌ని మోడీ వివ‌రించారు. ముఖ్యం గా క‌రోనా త‌ర్వాత‌.. భార‌త సామ‌ర్థ్యం ఏంటో ప్ర‌పంచ దేశాల‌కు తెలిసింద‌న్నారు. న‌వీన ప్ర‌పంచంలో భార‌త దేశ స్థానాన్ని ఎవ‌రూ విస్మ‌రించ‌లేని స్థాయికి భార‌త దేశం చేరిపోయింద‌న్నారు. వ‌ల‌స చ‌ట్టాల‌ను సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని ఇటీవ‌ల ఐపీసీ, సీఆర్ పీసీ వంటి చ‌ట్టాల మార్పుల‌ను ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

2 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

2 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

3 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

5 hours ago