ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోట వేదికగా జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వరసుగా ఆయన పదో సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ తరఫున ఇద్దరుప్రధానులు చేయగా.. వీరిలో మోడీ ఒక్కరే ఇలా.. పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం రికార్డుగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు.
ఇక, ఎర్రకోటపై జరిగిన వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ప్రధాని స్వయంగా ఆహ్వానించారు. వీరిలో ఏపీ రాష్ట్రం నుంచి 10 మంది ఉండడం విశేషం. ఇక, ఎన్నికల సంవత్సరం కావడంతో వీరి సంఖ్యను మరింత పెంచారు. గత ఏడాదితో పోల్చితే… ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం గమనార్హం.
యథా ప్రకారం..
ఇక, ఎర్రకోట పై నుంచి ప్రసంగించినా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. యథా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో 2014 వ సంవత్సరం వరకు జరిగిన పాలన ఒక ఎత్తయితే.. తర్వాత.. ఈ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. విశ్వ మంతా ఒక్కటే అనే నినాదాన్ని భుజాన వేసుకుని.. ప్రపంచానికి సైతం భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో ఈ తరహా ఆలోచన పాలకులకు రాలేదన్నారు.
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. భారతీయ పౌరులకు ఎనలేని గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయ ని, దీనికి 2014 తర్వాత తీసుకున్న నిర్ణయాలు వేసిన అడుగులే కారణమని మోడీ వివరించారు. ముఖ్యం గా కరోనా తర్వాత.. భారత సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. నవీన ప్రపంచంలో భారత దేశ స్థానాన్ని ఎవరూ విస్మరించలేని స్థాయికి భారత దేశం చేరిపోయిందన్నారు. వలస చట్టాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తున్నామని ఇటీవల ఐపీసీ, సీఆర్ పీసీ వంటి చట్టాల మార్పులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
This post was last modified on August 15, 2023 1:25 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…