Political News

వ‌రుస‌గా 10వ సారి.. మోడీ సాధించిన అరుదైన రికార్డు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క‌ ఎర్రకోట వేదికగా జ‌రిగిన‌ 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో వ‌ర‌సుగా ఆయ‌న ప‌దో సారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ త‌ర‌ఫున ఇద్ద‌రుప్ర‌ధానులు చేయ‌గా.. వీరిలో మోడీ ఒక్క‌రే ఇలా.. ప‌దోసారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం రికార్డుగా ఆ పార్టీ నేత‌లు అభివ‌ర్ణించారు.

ఇక‌, ఎర్రకోటపై జ‌రిగిన‌ వేడుకలను ప్ర‌త్య‌క్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ప్ర‌ధాని స్వ‌యంగా ఆహ్వానించారు. వీరిలో ఏపీ రాష్ట్రం నుంచి 10 మంది ఉండ‌డం విశేషం. ఇక‌, ఎన్నిక‌ల సంవ‌త్స‌రం కావ‌డంతో వీరి సంఖ్య‌ను మ‌రింత పెంచారు.  గత ఏడాదితో పోల్చితే… ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఈ కార్య‌క్ర‌మాన్ని తీర్చిదిద్ద‌డం గ‌మ‌నార్హం.

య‌థా ప్ర‌కారం..

ఇక‌, ఎర్ర‌కోట పై నుంచి ప్ర‌సంగించినా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. య‌థా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో 2014 వ సంవ‌త్స‌రం వ‌ర‌కు జ‌రిగిన పాల‌న ఒక ఎత్త‌యితే.. త‌ర్వాత‌.. ఈ దేశం అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగింద‌న్నారు. విశ్వ మంతా ఒక్క‌టే అనే నినాదాన్ని భుజాన వేసుకుని.. ప్ర‌పంచానికి సైతం భార‌త్ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. గ‌తంలో ఈ త‌ర‌హా ఆలోచ‌న పాల‌కుల‌కు రాలేద‌న్నారు.

ఇప్పుడు ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా.. భారతీయ పౌరుల‌కు ఎన‌లేని గుర్తింపు, ఆద‌ర‌ణ ల‌భిస్తున్నాయ ని, దీనికి 2014 త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు వేసిన అడుగులే కార‌ణ‌మ‌ని మోడీ వివ‌రించారు. ముఖ్యం గా క‌రోనా త‌ర్వాత‌.. భార‌త సామ‌ర్థ్యం ఏంటో ప్ర‌పంచ దేశాల‌కు తెలిసింద‌న్నారు. న‌వీన ప్ర‌పంచంలో భార‌త దేశ స్థానాన్ని ఎవ‌రూ విస్మ‌రించ‌లేని స్థాయికి భార‌త దేశం చేరిపోయింద‌న్నారు. వ‌ల‌స చ‌ట్టాల‌ను సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని ఇటీవ‌ల ఐపీసీ, సీఆర్ పీసీ వంటి చ‌ట్టాల మార్పుల‌ను ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

Satya

Recent Posts

నాని నెక్స్ట్… ఒకటి డౌట్.. ఒకటి ఫిక్స్?

టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…

3 minutes ago

కళాకారుడి చెమటకు దక్కిన గౌరవం

చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

28 minutes ago

బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…

1 hour ago

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…

1 hour ago

దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…

4 hours ago

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

4 hours ago