77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. అయితే.. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యతరగతిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం విశేషం. నిజానికి ఎర్రకోటపై నుంచి ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ప్రసంగించినా.. ఎప్పుడూ పథకాలు ప్రకటించలేదు.
పైగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రసంగాలు లేనేలేవు. కానీ, అన్నింటికీ.. అందరికీ భిన్నంగా వ్యవహరించే ప్రధాని మోడీ.. ఇప్పుడు కూడా తన రికార్డును అలానే కొనసాగించారు. వచ్చే రెండు మాసా ల్లో మధ్యతరగతి ప్రజలు కలలుగనే ఇంటి నిర్మాణానికి సంబంధించి లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ల కొనుగో లుకు సంబంధించి కీలకమైన పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు లేని విధంగా ఈ పథకం ద్వారా అనేక రెట్లు ప్రయోజనం ఉంటుందన్నారు.
లక్షల రూపాయల్లో మధ్యతరగతికి మేలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. పన్నులు కడుతూ.. దేశ ప్రగతి, పురోగతిలో భాగస్వాములైన మధ్యతరగతి వర్గాన్ని విస్మరించలేమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే.. వారి జీవిత కాల స్వప్నమైన ఇంటి విషయంలో త్వరలోనే కీలకమైన ప్రభుత్వ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే.. పేరు, ఇతర విషయాలను మాత్రం ఈ వేదికగా ప్రధాని వెల్లడించలేదు. కానీ, ఇలా స్వాతంత్య్ర దినోత్సవాన.. ఒక వర్గాన్ని ఆకర్షించేలా ప్రకటన చేయడం మాత్రం ఇదే తొలిసారి.
This post was last modified on August 15, 2023 12:14 pm
రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…
బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…
థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండు జిల్లాలకు సీఎం చంద్రబాబు బిగ్ టార్గెట్ విధించారు. వచ్చే 2029 ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం…