Political News

చంద్ర‌బాబు హిమాచ‌ల్ టూర్‌.. రీజ‌నేంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. అనూహ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నిన్న మొ న్న‌టి వ‌ర‌కు ఏపీలో ప‌ర్య‌టించిన ఆయ‌న అక‌స్మాత్తుగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో క‌నిపించ‌డం.. స‌తీస‌మేతంగా ఆయ‌న అక్క‌డ ఉండ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. వాస్త‌వానికి ఆదివారం కూడా చంద్ర‌బాబు ఏపీలోనే ఉన్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పైనా.. నాయ‌కుల‌పైనా జ‌రుగుతున్న దాడుల‌కు సంబంధించి ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తుల‌కు ఆయ‌న లేఖ సంధించారు.

సోమ‌వారం నాటికి వ‌చ్చేస‌రికి చంద్ర‌బాబు హిమాచ‌ల్ లో క‌నిపించారు. అది కూడా స‌తీస‌మేతంగా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. వ్యాహ్యాళి కోసం.. వెళ్లార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌.. స‌తీస‌మేతంగా చంద్ర‌బాబు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు వెళ్లార‌ని అంటున్నాయి. ఇదిలావుంటే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. బీజేపీ నాయ‌కుడు, గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు.

దీంతో ఈ ప‌ర్య‌ట‌న‌కు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటకు పైగా చంద్ర‌బాబు.. గ‌వ‌ర్న‌ర్ ద‌త్రాత్రేయుడితో చ‌ర్చ‌లు జ‌రిపారు.  ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ దూకుడుగా ఉండ‌డం.. ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాలే గ‌డువు ఉండ‌డంతో బాబు-ద‌త్తాత్రేయ‌ల భేటీకి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

This post was last modified on August 14, 2023 11:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago