ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీఆర్ఎస్.. అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్రణాళికల్లో నిమగ్నమయ్యారని తెలిసింది.
ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్కు.. కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయని టాక్. అందులో ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వీళ్లకున్న అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ విషయంపై కొంతమంది ఎమ్మెల్యేలనూ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎన్నికలకు ముందు తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికలకు ముందున్న ఈ సమయం ఎంతో కీలకమైందని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ చెబుతున్నారని సమాచారం. గ్రాఫ్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉంటున్నారా? తదితర విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని అంటున్నారు. సర్వే ఫలితాలను ముందేసుకుని ఒక్కో ఎమ్మెల్యేకు క్లాస్ పీకుతున్నట్లు తెలిసింది. మార్పు రాకపోతే టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ తెగేసి చెబుతున్నారని టాక్.
This post was last modified on August 14, 2023 6:27 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…