ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీఆర్ఎస్.. అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్రణాళికల్లో నిమగ్నమయ్యారని తెలిసింది.
ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్కు.. కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయని టాక్. అందులో ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వీళ్లకున్న అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ విషయంపై కొంతమంది ఎమ్మెల్యేలనూ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎన్నికలకు ముందు తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికలకు ముందున్న ఈ సమయం ఎంతో కీలకమైందని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ చెబుతున్నారని సమాచారం. గ్రాఫ్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉంటున్నారా? తదితర విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని అంటున్నారు. సర్వే ఫలితాలను ముందేసుకుని ఒక్కో ఎమ్మెల్యేకు క్లాస్ పీకుతున్నట్లు తెలిసింది. మార్పు రాకపోతే టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ తెగేసి చెబుతున్నారని టాక్.
This post was last modified on August 14, 2023 6:27 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…