Political News

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ఎట్టకేలకు..

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తోందో తెలిసిందే. వైరస్ దానంతట అది తగ్గుముఖం పట్టే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆశలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు చేపట్టే చర్యలు కానీ, జనాల స్వీయ క్రమశిక్షణ కానీ.. సరిపడా స్థాయిలో లేకపోవడంతో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నేపథ్యంలో కరోనా తాలూకు సంక్షోభానికి తెరపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు జరిగాయి. ట్రయల్స్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఐతే విదేశాల్లో ఈ పరిశోధనలు ఆరంభం కావడం ఆలస్యం.. వివిధ సంస్థలతో అక్కడి ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యాక్సిన్ ఆమోదం పొంది ఉత్పత్తి మొదలు కాగానే తమకు ఇంత స్థాయిలో డోస్‌లు ఇవ్వాలనే విధంగా ఈ ఒప్పందాలు జరిగాయి.

కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఈ దిశగా అడుగులేమీ వేయలేదు. వ్యాక్సిన్ తయారీలో దాదాపు పది సంస్థలు నిమగ్నమై ఉండగా.. వేటితోనూ సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు రాలేదు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఎవరికి వాళ్లు సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోవడమే తప్ప.. ప్రభుత్వం తమ వంతుగా ఏం చేయదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నెలలు గడిచాక ప్రభుత్వం వ్యాక్సిన్లు కొని.. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే వాటిని అందిస్తుందేమో అనుకున్నారు. కానీ ప్రభుత్వం అలా ఏమీ ఆలోచించట్లేదని తాజా చర్యలతో అర్థమవుతోంది. వ్యాక్సిన్ పరిశోధనల్లో చురుగ్గా ఉన్న భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సహా ఐదు సంస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. వాటితో ఒప్పందాలు కూడా చేసుకుంది. ట్రయల్స్ పూర్తవగానే ప్రభుత్వ అనుమతులు సాధ్యమైనంత త్వరగా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాబట్టి ఈ ఏడాది ఆఖర్లోపు వ్యాక్సిన్ రెడీ కావడం, మొత్తం జనాభాకు అవసరమైన మేర ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొని అందరికీ ఉచితంగా, లేదా తక్కువ ధరతో వ్యాక్సిన్లు వేయడం చేయొచ్చని తెలుస్తోంది.

This post was last modified on August 18, 2020 7:57 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago