Political News

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ఎట్టకేలకు..

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తోందో తెలిసిందే. వైరస్ దానంతట అది తగ్గుముఖం పట్టే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆశలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు చేపట్టే చర్యలు కానీ, జనాల స్వీయ క్రమశిక్షణ కానీ.. సరిపడా స్థాయిలో లేకపోవడంతో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నేపథ్యంలో కరోనా తాలూకు సంక్షోభానికి తెరపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు జరిగాయి. ట్రయల్స్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఐతే విదేశాల్లో ఈ పరిశోధనలు ఆరంభం కావడం ఆలస్యం.. వివిధ సంస్థలతో అక్కడి ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యాక్సిన్ ఆమోదం పొంది ఉత్పత్తి మొదలు కాగానే తమకు ఇంత స్థాయిలో డోస్‌లు ఇవ్వాలనే విధంగా ఈ ఒప్పందాలు జరిగాయి.

కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఈ దిశగా అడుగులేమీ వేయలేదు. వ్యాక్సిన్ తయారీలో దాదాపు పది సంస్థలు నిమగ్నమై ఉండగా.. వేటితోనూ సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు రాలేదు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఎవరికి వాళ్లు సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోవడమే తప్ప.. ప్రభుత్వం తమ వంతుగా ఏం చేయదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నెలలు గడిచాక ప్రభుత్వం వ్యాక్సిన్లు కొని.. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే వాటిని అందిస్తుందేమో అనుకున్నారు. కానీ ప్రభుత్వం అలా ఏమీ ఆలోచించట్లేదని తాజా చర్యలతో అర్థమవుతోంది. వ్యాక్సిన్ పరిశోధనల్లో చురుగ్గా ఉన్న భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సహా ఐదు సంస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. వాటితో ఒప్పందాలు కూడా చేసుకుంది. ట్రయల్స్ పూర్తవగానే ప్రభుత్వ అనుమతులు సాధ్యమైనంత త్వరగా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాబట్టి ఈ ఏడాది ఆఖర్లోపు వ్యాక్సిన్ రెడీ కావడం, మొత్తం జనాభాకు అవసరమైన మేర ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొని అందరికీ ఉచితంగా, లేదా తక్కువ ధరతో వ్యాక్సిన్లు వేయడం చేయొచ్చని తెలుస్తోంది.

This post was last modified on August 18, 2020 7:57 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago