Political News

రుషికొండ పై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ.

అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ.

కాగా ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ లో చేసిన ట్వీట్ పై ఎంపీ రఘు రామకృష్ణ రాజు మాట్లాడుతూ.. రిషికొండ వద్ద అధికారిక భవనాలు కట్టుకుంటే తప్పేంటని ముందు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మా పార్టీ మళ్లీ వెనక్కి తీసుకుంటూ.. ట్వీట్ ‌ను డిలీట్‌ చేశారన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు కడితే తప్పేంటని రోజా, అమర్నాథ్‌ లు అన్నారు.

ఆ ఇద్దరు మంత్రులకు కనీస పరిజ్ఞానం కూడా లేదు.. సీఆర్‌జెడ్‌ జోన్ ‌లో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఆ మంత్రులకు తెలియదా? అని ప్రశ్నించారు. పర్యాటకానికి సంబంధం లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు.. సీఎం ఇల్లు, తాత్కాలికంగా ఉండేందుకు కార్యదర్శుల కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రిషికొండ వద్ద నిర్మిస్తున్న నిర్మాణాలు.. అక్రమ కట్టడాలు అని వెల్లడించారు ఎంపీ రఘు రామ కృష్ణ రాజు.

This post was last modified on August 14, 2023 5:58 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago