బీసీ బంధు.. తెలంగాణలో ఎంబీసీలతో పాటు 14 బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించిన పథకం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రకటన అయితే ఘనంగానే చేశారు.. కానీ అమలు మాత్రం సవ్యంగా లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. అర్హులను అధికారులు గుర్తించినా.. ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా నిధులు పంపిణీ చేయలేకపోతున్నారని సమాచారం.
బీసీ బంధు కింద కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించగానే బీసీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ రూ.లక్ష కోసం జూన్లో 5.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో నుంచి 4.2 లక్షల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. జూన్ 15 నుంచి ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీన చాలా జిల్లాల్లో పంపిణీ ప్రారంభించలేకపోయారు. కొన్ని జిల్లాల్లోనేమో 50 నుంచి 100 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది.
దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ప్రభుత్వం.. బీసీ సంక్షేమ శాఖ ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. వీళ్లు జాబితా సిద్ధం చేశారు. కానీ ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తుల పేర్లు లేవని సమాచారం. పథకానికి అనర్హులుగా తేలడంతో చాలా మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులు ఉండడం ఇప్పుడు సమస్యగా మారింది. తాము సూచించిన వారిని ఎందుకు తొలగించారంటూ అధికారులను ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. జాబితాలో వాళ్ల పేర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు అర్హులేమో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులున్నారని తెలిసింది.
This post was last modified on August 14, 2023 5:42 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…