బీసీ బంధు.. తెలంగాణలో ఎంబీసీలతో పాటు 14 బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించిన పథకం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రకటన అయితే ఘనంగానే చేశారు.. కానీ అమలు మాత్రం సవ్యంగా లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. అర్హులను అధికారులు గుర్తించినా.. ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా నిధులు పంపిణీ చేయలేకపోతున్నారని సమాచారం.
బీసీ బంధు కింద కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించగానే బీసీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ రూ.లక్ష కోసం జూన్లో 5.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో నుంచి 4.2 లక్షల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. జూన్ 15 నుంచి ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి రూ.లక్ష చొప్పున సాయం అందించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీన చాలా జిల్లాల్లో పంపిణీ ప్రారంభించలేకపోయారు. కొన్ని జిల్లాల్లోనేమో 50 నుంచి 100 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది.
దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ప్రభుత్వం.. బీసీ సంక్షేమ శాఖ ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. వీళ్లు జాబితా సిద్ధం చేశారు. కానీ ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తుల పేర్లు లేవని సమాచారం. పథకానికి అనర్హులుగా తేలడంతో చాలా మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. ఇందులో ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులు ఉండడం ఇప్పుడు సమస్యగా మారింది. తాము సూచించిన వారిని ఎందుకు తొలగించారంటూ అధికారులను ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. జాబితాలో వాళ్ల పేర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు అర్హులేమో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులున్నారని తెలిసింది.
This post was last modified on August 14, 2023 5:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…