Political News

తన అసలు బలంపై టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఒకపుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీలకు వేదిక. ఈ రెండు సామాజిక వర్గాలు ఆరు నూరైనా నూరు ఆరైనా కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతరులవైపు వేళ్ళేవి కావు. అలాంటిది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, బలం పుంజుకోవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడింది. ఇపుడు కాంగ్రెస్ కు పలానా ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉందని చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పార్టీ ఓటు బ్యాంకులను ప్రాంతీయ పార్టీలు కొల్లగొట్టేశాయి. అందుకనే తన సంప్రదాయ ఓటుబ్యాంకును మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకు హస్తం పార్టీ రెడీ అయ్యింది.

ఇందులో భాగంగానే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రణాళికలను వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దళిత, గురిజులకు ఇచ్చే భూములపై సర్వ హక్కులు వాళ్ళకే అందేట్లు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇపుడు తెలంగాణలో ఎస్సీలకు 19 నియోజకవర్గాలు, ఎస్టీలకు 12 నియోజకవర్గాలున్నాయి. ఒకపుడు ఈ 31 నియోజకవర్గాల్లో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇపుడు బలహీనపడిపోయింది.

మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో గనుక పార్టీ గెలవగలిగితే అధికారంలోకి రావటం ఖాయమని కాంగ్రెస్ సీనియర్లు అంచనాలు వేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే ప్రణాళికలు కూడా రెడీచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. ఇందుకని చేవెళ్ళల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.

సమాజంలో ఎస్టీల జనాభా తక్కువే అయినా ఎస్సీల జనాభా ఎక్కువగానే ఉంటుంది. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా ఎస్టీల జనాభా పెద్దగా లేకపోవచ్చు కానీ ఎస్సీల జనాభానే గెలుపోటములను నిర్ణయించేంగా ఉంటుంది. కాబట్టి దూరమైన ఓటుబ్యాంకులను మళ్ళీ దగ్గరకు చేర్చుకోవటంలో భాగంగానే ప్రత్యేక డిక్లరేషన్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే బీసీ, రైతు, మహిళా, యువత డిక్లరేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మరిన్ని డిక్లరేషన్లను ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నింటినీ అమలు చేయగలుగుతుందా అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపుకోసం ఎలాంటి హామీలైన నేతలు ఇచ్చేస్తారు కదా. 

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago