మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీ మారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇదే సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటున్నట్లు టాక్.
ఇపుడు వివేక్ సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ లోకి వెళ్ళాలా లేకపోతే కాంగ్రెస్ లో చేరాలా ? అని. ఇప్పటికే వివేక్ రెండు మూడు పార్టీలు మారారు. తరచూ పార్టీలు మారుతుంటారనే ముద్ర వివేక్ పైన పడిపోయింది. అయినా సరే అనుకున్నంత లబ్ది అయితే దొరకడం లేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై బాగా అయోమయం పెరిగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయంతో కాంగ్రెస్ మంచి ఊపు మీదుంది. అయితే ఈ మధ్య ఆ ఊపు కాస్త తగ్గింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో కాస్త హడావుడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కేసీయార్ పదేపదే చెబుతున్నారు. అధికారంలో ఉండటం ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే అంతా పాత కాపులే కానీ తనకు సరైన గుర్తింపు ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని వదిలి వివేక్ వెళ్ళిపోయారు.
అప్పుడెప్పుడో పెద్దపల్లి ఎంపీగా గెలిచారంతే. మళ్ళీ చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. ఈ నేపధ్యంలోనే కుటుంబ సభ్యులేమో బీఆర్ఎస్ లోకి వెళితే మంచిదని సలహా ఇస్తున్నారట. అయితే కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట. మూడు పార్టీల విషయంలో ఒకటి ఖాయం ఏమిటంటే బీజేపీ అయితే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది అయితే లేదు. అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్ విషయంలో వివేక్ లో అయోమయం పెరిగిపోతోందట. తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్నదే అసలైన సమస్య.
This post was last modified on August 14, 2023 11:05 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…