మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీ మారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇదే సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటున్నట్లు టాక్.
ఇపుడు వివేక్ సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ లోకి వెళ్ళాలా లేకపోతే కాంగ్రెస్ లో చేరాలా ? అని. ఇప్పటికే వివేక్ రెండు మూడు పార్టీలు మారారు. తరచూ పార్టీలు మారుతుంటారనే ముద్ర వివేక్ పైన పడిపోయింది. అయినా సరే అనుకున్నంత లబ్ది అయితే దొరకడం లేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై బాగా అయోమయం పెరిగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయంతో కాంగ్రెస్ మంచి ఊపు మీదుంది. అయితే ఈ మధ్య ఆ ఊపు కాస్త తగ్గింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో కాస్త హడావుడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కేసీయార్ పదేపదే చెబుతున్నారు. అధికారంలో ఉండటం ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే అంతా పాత కాపులే కానీ తనకు సరైన గుర్తింపు ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని వదిలి వివేక్ వెళ్ళిపోయారు.
అప్పుడెప్పుడో పెద్దపల్లి ఎంపీగా గెలిచారంతే. మళ్ళీ చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. ఈ నేపధ్యంలోనే కుటుంబ సభ్యులేమో బీఆర్ఎస్ లోకి వెళితే మంచిదని సలహా ఇస్తున్నారట. అయితే కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట. మూడు పార్టీల విషయంలో ఒకటి ఖాయం ఏమిటంటే బీజేపీ అయితే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది అయితే లేదు. అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్ విషయంలో వివేక్ లో అయోమయం పెరిగిపోతోందట. తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్నదే అసలైన సమస్య.
This post was last modified on August 14, 2023 11:05 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…