వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గాజువాకలో పవన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే అని అన్నారు. ప్రజాధరణ చూస్తుంటే పోయిన ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లుగా భావించటం లేదన్నారు. గాజువాక తన నియోజకవర్గం అని ప్రకటించారు. సరే తర్వాత చాలా విషయాలే మాట్లాడారు. గాజువాక సభలో పవన్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో పవన్ మళ్ళీ ఇక్కడినుండే పోటీచేయాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే పోయిన ఎన్నికల్లో పవన్ అక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్ సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా తాను గాజువాకలోనే ఆఫీసు పెట్టుకుంటానని చెప్పారు కానీ ఆ తర్వాత మొహం కూడా చూడలేదు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మీటింగులప్పుడు గాజువాకకు రావటమే కానీ ప్రత్యేకించి పర్యటించింది లేదు. అసలు పోయిన ఎన్నికల్లో గాజువాకలో పవన్ ఎందుకు పోటీ చేశారు ?
ఎందుకంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం నమోదైంది గాజువాకలోనే. సుమారు 95 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. దాంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యాంరెటీ అని అర్ధమైన కారణంగానే పవన్ ఏరికోరి భీమవరంతో పాటు ఇక్కడ కూడా పోటీచేసింది. అయితే పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే సభ్యత్వ నమోదు వేరు, ఓట్లేయటం వేరని.
రకరకాల కారణాలతో సభ్యత్వాలు 95 వేలకు చేరుకునుండచ్చు. కానీ వాళ్ళంతా ఓట్లేస్తారని గ్యారెంటీ లేదు. అందుకనే 16 వేల తేడాతో ఓడిపోయారు. సరే చరిత్రను పక్కన పెట్టేస్తే ఇపుడు గాజువాక పర్యటన సందర్భంగా పవన్ ఆలోచన చూస్తే మళ్ళీ ఇపుడు ఇక్కడినుండే పోటీచేయాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలని ఓ పది దాకా ప్రచారంలో ఉన్నాయి. వీటిల్లో భీమవరం కూడా ఉంది. దానికి ఇపుడు గాజువాక అదనంగా తోడైనట్లుంది. మరి పోటీచేయబోయే నియోజకవర్గాన్ని పవన్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
This post was last modified on August 14, 2023 11:00 am
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…