Political News

మ‌ల్లారెడ్డి ఎక్క‌డ కాలు పెట్టినా!

బీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి.. పూల‌మ్మిన‌, పాల‌మ్మిన‌, క‌ష్ట‌ప‌డ్డా,  స‌క్సెస్ అయిన అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఇదే డైలాగ్ కొడుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.  మేడ్చ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధి ప‌నులు చేయ‌డం లేద‌ని, ఎందుకు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నార‌ని ప్ర‌జలు ప్ర‌శ్నిస్తున్నారు.

2014లో ఎంపీగా గెలిచిన మ‌ల్లారెడ్డి 2018లో మేడ్చ‌ల్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ప్ర‌జలు మ‌ల్లారెడ్డిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తుండ‌డంతో తిరిగి నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ప‌ట్ట‌ని ఆయ‌న్ని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. సీసీ రోడ్డు శంకుస్థాప‌న కోసం వెళ్లిన మ‌ల్లారెడ్డిని కాచ‌వాని సింగారం గ్రామం ప్ర‌జ‌లు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. బీసీ భ‌వ‌నం నిర్మించాల్సిన స్థ‌లంలో సీసీ రోడ్డు ఎలా వేస్తార‌ని మంత్రిని నిల‌దీయ‌డంతో ఆయ‌న వెనుదిరిగారు.

తాజాగా శామీర్‌పేట్ మండ‌లం అలియాబాద్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి ప‌ర్య‌ట‌న‌ను స్థానికులు అడ్డుకున్నారు. గ‌తంలో గ్రామాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారించాల‌ని మ‌ల్లారెడ్డిని కోరామ‌ని, కానీ ప‌ట్టించుకోలేద‌ని గ్రామ‌స్థులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్థానికుల‌తో మాట్లాడి సర్దిచెప్పేందుకు మ‌ల్లారెడ్డి ప్ర‌య‌త్నించారు. కానీ గ్రామ‌స్థులు వినక‌పోవ‌డంతో మ‌ల్లారెడ్డి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఎన్నిక‌ల‌ వ‌ర‌కూ ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మ‌ల్లారెడ్డికి క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

This post was last modified on August 13, 2023 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago