Political News

కీల‌క ఓటు బ్యాంకుపై టీడీపీ వ్యూహం!

ఔను.. అటు మ‌హిళ‌లు.. ఇటు రైతులు.. ఈ రెండు ఓటు బ్యాంకులు ఏ పార్టీకైనా అత్యంత కీల‌కం. ఎందు కంటే.. ఎన్నిక‌ల్లో ఇత‌ర వ‌ర్గాల ఓటు బ్యాంకుఎలా ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎటూ పోవు. ఖ‌చ్చితంగా పోలింగ్ బూత్‌కు వ‌చ్చేవారిలో రైతులు మ‌హిళ‌లు ఉంటారు. అందుకే.. ఈ రెండు ఓటు బ్యాంకుల‌పైనా.. పార్టీలు క‌న్నేస్తాయి. ఇదే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ మైలేజీ ఇచ్చింద‌నే చ‌ర్చ ఉంది.

ఇక‌, ఇప్పుడు రైతులు, మ‌హిళా ఓటు బ్యాంకును త‌మవైపు తిప్పుకొనేందుకు టీడీపీ కూడా యుద్ధ ప్రాతిపది క‌న ముందుకు సాగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. క్షేత్ర‌స్థాయిలో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేలా యాత్ర‌లు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం పేరుతో ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ఆయా ప్రాజెక్టుల తీరుతెన్నులు.. గ‌తంలో త‌మ హ‌యాంలో ఎలా నిర్మాణాలు పూర్తి చేశాం. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాల‌ను వివ‌రిస్తున్నారు.

దీంతో రైతాంగంలోనూ.. చ‌ర్చ ప్రారంభ‌మైంది. త‌మ‌కు జ‌రుగుతున్న ప్ర‌యోజ‌నంపై వారు చ‌ర్చించుకుం టున్నారు. ఇదేస‌మ‌యంలో రైతుల‌కు టీడీపీ హ‌యాంలో జ‌రిగిన మేలు ను కూడా చంద్ర‌బాబు వివ‌రిస్తు న్నారు. రుణ మాఫీ నుంచి సాగు నీటి ప్రాజెక్టులు, ప‌ట్టిసీమ వంటివాటి ద్వారా రైతుల‌కు మేలు జ‌రిగేలా తీసుకు న్న నిర్ణ‌యాల‌ను వివ‌రించారు. దీంతో రైతాంగంలోనూ మార్పుక‌నిపిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

మ‌రోవైపు.. మ‌హిళా ఓట‌ర్ల‌ను చేరువ చేసుకునేందుకు ఈ ఏడాది మేలో ప్ర‌క‌టించిన మినీ మ‌హానాడును గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. సైలెంట్‌గా జ‌రుగుతున్న ఈ ప్ర‌చారం .. గ్రామ గ్రామానా జోరుగా సాగుతోంది. ప్ర‌తి ఇంటికీ వెళ్తున్న టీడీపీ మండ‌ల‌స్థాయి నాయ‌కులు.. ఇక్క‌డి మహిళ‌ల‌ను క‌లుస్తూ.. మేనిఫెస్టోలో మ‌హిళా శ‌క్తి.. గురించిన ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. అండ‌ర్ కరెంట్‌గా సాగుతున్న ఈ ప్ర‌చారం త‌మ‌కు మేలు చేస్తుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతుండ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on August 13, 2023 1:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

58 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago