ఔను.. అటు మహిళలు.. ఇటు రైతులు.. ఈ రెండు ఓటు బ్యాంకులు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. ఎందు కంటే.. ఎన్నికల్లో ఇతర వర్గాల ఓటు బ్యాంకుఎలా ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎటూ పోవు. ఖచ్చితంగా పోలింగ్ బూత్కు వచ్చేవారిలో రైతులు మహిళలు ఉంటారు. అందుకే.. ఈ రెండు ఓటు బ్యాంకులపైనా.. పార్టీలు కన్నేస్తాయి. ఇదే.. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ మైలేజీ ఇచ్చిందనే చర్చ ఉంది.
ఇక, ఇప్పుడు రైతులు, మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు టీడీపీ కూడా యుద్ధ ప్రాతిపది కన ముందుకు సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాత్రలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం పేరుతో ఆయన జిల్లాల్లో పర్యటించి.. ఆయా ప్రాజెక్టుల తీరుతెన్నులు.. గతంలో తమ హయాంలో ఎలా నిర్మాణాలు పూర్తి చేశాం. ఇప్పుడు ఏం జరుగుతోంది? అనే విషయాలను వివరిస్తున్నారు.
దీంతో రైతాంగంలోనూ.. చర్చ ప్రారంభమైంది. తమకు జరుగుతున్న ప్రయోజనంపై వారు చర్చించుకుం టున్నారు. ఇదేసమయంలో రైతులకు టీడీపీ హయాంలో జరిగిన మేలు ను కూడా చంద్రబాబు వివరిస్తు న్నారు. రుణ మాఫీ నుంచి సాగు నీటి ప్రాజెక్టులు, పట్టిసీమ వంటివాటి ద్వారా రైతులకు మేలు జరిగేలా తీసుకు న్న నిర్ణయాలను వివరించారు. దీంతో రైతాంగంలోనూ మార్పుకనిపిస్తోందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.
మరోవైపు.. మహిళా ఓటర్లను చేరువ చేసుకునేందుకు ఈ ఏడాది మేలో ప్రకటించిన మినీ మహానాడును గ్రామీణ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సైలెంట్గా జరుగుతున్న ఈ ప్రచారం .. గ్రామ గ్రామానా జోరుగా సాగుతోంది. ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ మండలస్థాయి నాయకులు.. ఇక్కడి మహిళలను కలుస్తూ.. మేనిఫెస్టోలో మహిళా శక్తి.. గురించిన పథకాలను వివరిస్తున్నారు. అండర్ కరెంట్గా సాగుతున్న ఈ ప్రచారం తమకు మేలు చేస్తుందని పార్టీ నాయకులు చెబుతుండడంగమనార్హం.
This post was last modified on August 13, 2023 1:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…