Political News

లిక్కర్ సిండికేట్లు రెడీ అయ్యాయా ?

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు చప్పుడు చేయలేదు.

రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే అర్జంటుగా నెలరోజుల్లోపు రు. 27 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేసేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేయటం ఒక నిముషంలోని పని. అయితే అందుకు డబ్బులుండద్దా ? ఆ డబ్బుల కోసమే ఆదాయార్జన శాఖలను పట్టుకుని పిండేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మీద కూడా కేసీయార్ కన్నుపడింది. అందుకనే రెండునెలల ముందుగానే  2620 వైన్ షాపులకు  నోటిఫికేషన్ జారీచేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లు వేసేందుకు చాలా మండలాల్లో లిక్కర్ సిండికేట్లు ఏర్పాటైనట్లు సమాచారం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంబ్లను ముందుంచి రాజకీయ నేతలే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారట. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల సీజన్లే అని. మరో నాలుగు నెలల్లో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత తొమ్మిదినెలలకు పార్లమెంటు ఎన్నికలు వస్తాయి.

అవి అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఖాయం. మళ్ళీ ఎక్కడో చోట ఉపఎన్నికలు వచ్చాయంటే లిక్కర్ సిండికేట్ కు పండగే పండగ. దుబ్బాక, హుజూరాబాద్,  నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ విపరీతంగా జరిగింది. అడ్వాన్స్ నోటిపికేషన్ పీజు, షాపుల వేలంపాటలు, తర్వాత ఫీజుల రూపంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు సుమారు 17 వేల కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వం అంచనా ప్రకారం 17 వేల కోట్ల రాపాయలు వస్తే మిగిలిన రు. 10 వేల కోట్లను ఇతరత్రా మార్గాల్లో సేకరించి వెంటన రైతు రుణమాఫీ చేయాలన్నది కేసీయార్ ఆలోచన.  

This post was last modified on August 13, 2023 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

37 minutes ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

3 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

5 hours ago

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

11 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

12 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

12 hours ago