రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు చప్పుడు చేయలేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే అర్జంటుగా నెలరోజుల్లోపు రు. 27 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేసేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేయటం ఒక నిముషంలోని పని. అయితే అందుకు డబ్బులుండద్దా ? ఆ డబ్బుల కోసమే ఆదాయార్జన శాఖలను పట్టుకుని పిండేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మీద కూడా కేసీయార్ కన్నుపడింది. అందుకనే రెండునెలల ముందుగానే 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లు వేసేందుకు చాలా మండలాల్లో లిక్కర్ సిండికేట్లు ఏర్పాటైనట్లు సమాచారం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంబ్లను ముందుంచి రాజకీయ నేతలే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారట. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల సీజన్లే అని. మరో నాలుగు నెలల్లో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత తొమ్మిదినెలలకు పార్లమెంటు ఎన్నికలు వస్తాయి.
అవి అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఖాయం. మళ్ళీ ఎక్కడో చోట ఉపఎన్నికలు వచ్చాయంటే లిక్కర్ సిండికేట్ కు పండగే పండగ. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ విపరీతంగా జరిగింది. అడ్వాన్స్ నోటిపికేషన్ పీజు, షాపుల వేలంపాటలు, తర్వాత ఫీజుల రూపంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు సుమారు 17 వేల కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వం అంచనా ప్రకారం 17 వేల కోట్ల రాపాయలు వస్తే మిగిలిన రు. 10 వేల కోట్లను ఇతరత్రా మార్గాల్లో సేకరించి వెంటన రైతు రుణమాఫీ చేయాలన్నది కేసీయార్ ఆలోచన.
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…