రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు చప్పుడు చేయలేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే అర్జంటుగా నెలరోజుల్లోపు రు. 27 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేసేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేయటం ఒక నిముషంలోని పని. అయితే అందుకు డబ్బులుండద్దా ? ఆ డబ్బుల కోసమే ఆదాయార్జన శాఖలను పట్టుకుని పిండేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మీద కూడా కేసీయార్ కన్నుపడింది. అందుకనే రెండునెలల ముందుగానే 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లు వేసేందుకు చాలా మండలాల్లో లిక్కర్ సిండికేట్లు ఏర్పాటైనట్లు సమాచారం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంబ్లను ముందుంచి రాజకీయ నేతలే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారట. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల సీజన్లే అని. మరో నాలుగు నెలల్లో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత తొమ్మిదినెలలకు పార్లమెంటు ఎన్నికలు వస్తాయి.
అవి అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఖాయం. మళ్ళీ ఎక్కడో చోట ఉపఎన్నికలు వచ్చాయంటే లిక్కర్ సిండికేట్ కు పండగే పండగ. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ విపరీతంగా జరిగింది. అడ్వాన్స్ నోటిపికేషన్ పీజు, షాపుల వేలంపాటలు, తర్వాత ఫీజుల రూపంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు సుమారు 17 వేల కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వం అంచనా ప్రకారం 17 వేల కోట్ల రాపాయలు వస్తే మిగిలిన రు. 10 వేల కోట్లను ఇతరత్రా మార్గాల్లో సేకరించి వెంటన రైతు రుణమాఫీ చేయాలన్నది కేసీయార్ ఆలోచన.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…