రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు చప్పుడు చేయలేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే అర్జంటుగా నెలరోజుల్లోపు రు. 27 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేసేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేయటం ఒక నిముషంలోని పని. అయితే అందుకు డబ్బులుండద్దా ? ఆ డబ్బుల కోసమే ఆదాయార్జన శాఖలను పట్టుకుని పిండేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మీద కూడా కేసీయార్ కన్నుపడింది. అందుకనే రెండునెలల ముందుగానే 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లు వేసేందుకు చాలా మండలాల్లో లిక్కర్ సిండికేట్లు ఏర్పాటైనట్లు సమాచారం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంబ్లను ముందుంచి రాజకీయ నేతలే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారట. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల సీజన్లే అని. మరో నాలుగు నెలల్లో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత తొమ్మిదినెలలకు పార్లమెంటు ఎన్నికలు వస్తాయి.
అవి అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఖాయం. మళ్ళీ ఎక్కడో చోట ఉపఎన్నికలు వచ్చాయంటే లిక్కర్ సిండికేట్ కు పండగే పండగ. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ విపరీతంగా జరిగింది. అడ్వాన్స్ నోటిపికేషన్ పీజు, షాపుల వేలంపాటలు, తర్వాత ఫీజుల రూపంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు సుమారు 17 వేల కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వం అంచనా ప్రకారం 17 వేల కోట్ల రాపాయలు వస్తే మిగిలిన రు. 10 వేల కోట్లను ఇతరత్రా మార్గాల్లో సేకరించి వెంటన రైతు రుణమాఫీ చేయాలన్నది కేసీయార్ ఆలోచన.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…