తెలంగాణ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించవచ్చనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్లుగా కసరత్తులు చేస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అధిష్ఠానం.. ఇక్కడ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతలను అగ్ర నేతలకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారం, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు అధిష్ఠానం అప్పగించినట్లు టాక్.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ కార్యదర్శులు తమ పని తాము చేస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి మరో ఇద్దరు అగ్ర నేతలను తెలంగాణ కోసం కాంగ్రెస్ బరిలో దింపుతుండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అంతర్గత విభేదాలకు లోటు లేదు. ఇక్కడ పార్టీలో అందరూ కీలక నాయకులే. వీళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే తెలంగాణలో పార్టీని గాడిన పెట్టి ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్లను కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల జట్టు.. ఈ ఇద్దరి చేతుల్లోకి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడినా ఎలాంటి తేడా రాలేదని, కానీ ఎన్నికల సమయంలో తోక జాడిస్తే చర్యలు తప్పవని అధిష్ఠానం సూచన ప్రాయంగా చెప్పిందని సమాచారం. ప్రియాంక ఎప్పటి నుంచో పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో పార్టీని అధికారంలో తేవడంతో శివకుమార్ది కీలక పాత్ర. మరి ఈ ఇద్దరు కలిసి తెలంగాణలో ఎలాంటి మాయ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 12, 2023 7:26 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…