తెలంగాణ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించవచ్చనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్లుగా కసరత్తులు చేస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అధిష్ఠానం.. ఇక్కడ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే బాధ్యతలను అగ్ర నేతలకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారం, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు అధిష్ఠానం అప్పగించినట్లు టాక్.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ కార్యదర్శులు తమ పని తాము చేస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి మరో ఇద్దరు అగ్ర నేతలను తెలంగాణ కోసం కాంగ్రెస్ బరిలో దింపుతుండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అంతర్గత విభేదాలకు లోటు లేదు. ఇక్కడ పార్టీలో అందరూ కీలక నాయకులే. వీళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే తెలంగాణలో పార్టీని గాడిన పెట్టి ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్లను కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల జట్టు.. ఈ ఇద్దరి చేతుల్లోకి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడినా ఎలాంటి తేడా రాలేదని, కానీ ఎన్నికల సమయంలో తోక జాడిస్తే చర్యలు తప్పవని అధిష్ఠానం సూచన ప్రాయంగా చెప్పిందని సమాచారం. ప్రియాంక ఎప్పటి నుంచో పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో పార్టీని అధికారంలో తేవడంతో శివకుమార్ది కీలక పాత్ర. మరి ఈ ఇద్దరు కలిసి తెలంగాణలో ఎలాంటి మాయ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 12, 2023 7:26 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…