రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే తన పరిస్ధితి ఏమిటో కేసీయార్ కు బాగా తెలుసు. హ్యాట్రిక్ విజయం సాధిస్తేనే కేసీయార్ కు జాతీయరాజకీయాల్లో కనీసం గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఎలాంటి గుర్తింపు లేకుండా ఉనికికోసమే పాకులాడాల్సుంటంది. అధికారంలో ఉన్నపుడే ఇపుడు జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కు గుర్తింపులేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే అసలు దేకే వాళ్ళే ఉండరన్నది వాస్తవం. అందుకనే గెలుపుకోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే శ్రావణమాసంలో కొన్ని సామాజికవర్గాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని అనుకున్నారట. కమ్మ, రెడ్డి, బీసీ, మైనారిటి సామాజికవర్గాల్లోని ముఖ్యులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గం ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీళ్ళల్లో ముఖ్యులు బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్లు నివేదికలు అందాయట. కమ్మ సామాజికవర్గం మెల్లిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతోందని సమాచారం. టీడీపీ ఎలాగు లేదు కాబట్టి, బీఆర్ఎస్ ఏమిటో చూశాం కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలని అనుకుంటున్నారట.
ఇక రెడ్డి సామాజికవర్గంలో మెజారిటి నేతలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాకపోతే రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గారు. అయితే బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఉపయోగాలు ఉండవన్న విషయం నిర్ధారణైందట. అందుకనే మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు పెరుగుతోందని సమాచారం. ఇక బీసీలంటారా సమాజంలో సగం జనాభా వాళ్ళదే కాబట్టి బీసీ సామాజికవర్గాలను తనవైపే ఉండేట్లుగా కేసీయార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు టాక్. తన పాలనలో బీసీల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే రిపోర్టులు అందాయట.
ఇక మైనారిటిల సామాజికవర్గం కూడా తక్కువేమీ లేదు. మైనారిటీల్లో క్రిస్తియన్లు, జైనులు, సిక్కులు, బౌద్ధలకన్నా ముస్లింల జనాభా చాలా ఎక్కువ. కనీసం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములను ముస్లింలే డిసైడ్ చేయగలరట. అందుకనే వీళ్ళ ఓట్లపైన కేసీయార్ బాగా దృష్టిపెట్టారు. అయితే అనేక కారణాల వల్ల మైనారిటిల్లో కేసీయార్ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, సంక్షేమపథకాలు సక్రమంగా అమలు కాకపోవటం లాంటి అనేక కారణాలతో ముస్లింల్లో వ్యతిరేకత పెరుగుతోందట. అందుకనే పై వర్గాలను మంచి చేసుకునేందుకే ప్రత్యేకంగా కుల సమ్మేళనాలకు తెరలేపబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on August 12, 2023 1:35 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…