Political News

బారికేడ్ దూకి మరీ రుషికొండ వెళ్లిన పవన్

విశాఖలోని జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పవన్ రుషికొండ పర్యటనపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.

జోడిగుడ్లపాలెం నుంచి ఎవరిని అనుమతించమని, రాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు. రుషికొండపైకి వెళ్లకుండా గోడ దగ్గర నుంచి మాత్రమే చూడాలని నిబంధనలు పెట్టారు. గీతం యూనివర్సిటీ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నేపద్యంలోనే పోలీసుల ఆంక్షల మధ్య ఉద్రిక్త వాతావరణం నడుమ పవన్ కళ్యాణ్ రుషికొండను సందర్శించారు.

 రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతొ, బారికేడ్ దూకి మరీ రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పరిశీలించారు. రోడ్డుపై నుంచి చూడాలని చెప్పడంతో అక్కడి నుంచే కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. నిబంధనలు పాటించాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. విపక్షాలు చిన్న నిరసన చేపట్టినా అరెస్టు చేస్తారని, జగన్ మాత్రం కొండను తవ్వినా ఏం కాదని విమర్శించారు. తెలంగాణలో ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారు అని అన్నారు.

సీఎం కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా, ఓ మూలన కూర్చోలేడా ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి ఇక్కడ రుషికొండ మీద అవసరమా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను దోపిడీ చేయాలని వైసిపి నేతలు చూస్తున్నారని, ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని మీడియా కూడా ప్రశ్నించి ప్రజలకు చేరవేయాలని అన్నారు. ఇప్పటివరకు ఒక్క రాజధానికే దిక్కు లేదని పవన్ ఎద్దేవా చేశారు.

This post was last modified on August 11, 2023 11:11 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago