Political News

బారికేడ్ దూకి మరీ రుషికొండ వెళ్లిన పవన్

విశాఖలోని జగదాంబ సెంటర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పవన్ రుషికొండ పర్యటనపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.

జోడిగుడ్లపాలెం నుంచి ఎవరిని అనుమతించమని, రాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు. రుషికొండపైకి వెళ్లకుండా గోడ దగ్గర నుంచి మాత్రమే చూడాలని నిబంధనలు పెట్టారు. గీతం యూనివర్సిటీ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నేపద్యంలోనే పోలీసుల ఆంక్షల మధ్య ఉద్రిక్త వాతావరణం నడుమ పవన్ కళ్యాణ్ రుషికొండను సందర్శించారు.

 రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతొ, బారికేడ్ దూకి మరీ రుషికొండ ప్రాంతాన్ని జనసేన అధినేత పరిశీలించారు. రోడ్డుపై నుంచి చూడాలని చెప్పడంతో అక్కడి నుంచే కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. నిబంధనలు పాటించాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. విపక్షాలు చిన్న నిరసన చేపట్టినా అరెస్టు చేస్తారని, జగన్ మాత్రం కొండను తవ్వినా ఏం కాదని విమర్శించారు. తెలంగాణలో ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారు అని అన్నారు.

సీఎం కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా, ఓ మూలన కూర్చోలేడా ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి ఇక్కడ రుషికొండ మీద అవసరమా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను దోపిడీ చేయాలని వైసిపి నేతలు చూస్తున్నారని, ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని మీడియా కూడా ప్రశ్నించి ప్రజలకు చేరవేయాలని అన్నారు. ఇప్పటివరకు ఒక్క రాజధానికే దిక్కు లేదని పవన్ ఎద్దేవా చేశారు.

This post was last modified on August 11, 2023 11:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago