భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. అతడికి దేశభక్తి సామాజిక సేవా దృక్పథం కొంచెం ఎక్కువే. ఈ విషయంలో అనేకసార్లు తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పుడు అతను ఓ గొప్ప పనితో వార్తల్లో నిలిచాడు. తన ఇంట్లో పని మనిషిగా ఉన్నసరస్వతి పత్రా అంత్యక్రియలను తనే నిర్వహించాడు ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా షుగర్, హైబీపీతో బాధ పడుతోంది. కొన్ని రోజుల కిందట ఆమె పరిస్థితి విషమించింది. ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే లాక్డౌన్ కారణంగా మృతదేహాన్ని ఒడిశాలో ఉంటున్న ఆమె కుటుంబానికి పంపలేని పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో సరస్వతి పత్రా అంత్యక్రియల్ని తనే చేయాలని గంభీర్ నిర్ణయించుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో పెద్దగా జనాల్లేకుండా గంభీర్ కుటుంబ సభ్యులు, సహాయకులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనగా.. గంభీర్ కొడుకులా మారి ఆమె లాంఛనాలన్నీ ముగించాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గంభీర్ వెల్లడించాడు.‘‘నా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషి కాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందర్నీ గౌరవించాలనేదే నా సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే మార్గం. అది నా దేశం ఆలోచన. ఓం శాంతి’’ అని గంభీర్ ట్వీట్ చేశారు.
తన పెద్ద మనసును చాటుకున్న గంభీర్ను కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా చాలామంది అభినందించారు. సరస్వతి ఒడిశాలోని జాజ్పుర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ స్థానిక మీడియా వెల్లడించింది.
This post was last modified on April 24, 2020 9:42 pm
అనుకున్నట్టే పుష్ప 2 ది రూల్ ఓటిటిలోకి వచ్చాక సంచలనాలు మొదలుపెట్టింది. వ్యూస్ పరంగా ఎన్ని రికార్డులు నమోదయ్యాయనేది బయటికి…
రాజకీయ పార్టీ అధినేతలు.. నేతలు విమర్శలు చేయటం.. తీవ్ర ఆరోపణలు చేయటం మామూలే. అయితే.. దేశ చరిత్రలో ఇప్పటివరకు ప్రధాన…
గేమ్ ఛేంజర్ ఫలితం గురించి మాట్లాడేందుకు ఏం లేదు కానీ అప్పుడప్పుడు వద్దన్నా దాని తాలూకు కంటెంట్ అభిమానులను గుచ్చుతూనే…
కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక…
టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంది. యంగ్…
తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి…