Political News

అసూయ, ద్వేషాలతోనే పవన్ అలా.. : మంత్రి అమర్నాథ్‌!

గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్ర వైజాగ్‌ లో ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో భాగంగా పవన్‌ రాత్రి జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఏపీ సీఎం జగన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి విరుచుకుపడ్డారు.తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జగనే అని విమర్శించారు. జగన్ తో పాటు ఆయన అనుచరులు అందరూ తెలంగాణలోని భూములు దోచుకు తిన్నారు. అందుకే అక్కడి వారందరూ తరిమేశారు. ఏపీకి పొమ్మని గట్టిగా బుద్ది చెప్పారు.

ఇక్కడ ఉన్న రుషి కొండ, ఎర్ర మట్టి దిబ్బలు, సహజ వనరులు కూడా దోచుకుంటున్నారని పవన్‌ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా కేంద్రంతో కలిసి నిన్ను ఒక ఆటాడిస్తా జగన్ అంటూ సీఎంకి వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్‌ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు.

విశాఖ వేదికగా పవన్‌ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్‌ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు. జగన్‌ కి పవన్‌ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలాంటిదో వేమన ఎప్పుడో చెప్పారంటూ పేర్కొన్నారు. పవన్‌ కి ఓ స్థిరత్వం, సిద్దాంతం ఏమి లేదు. ప్రస్తుతం పవన్‌ పరిస్థితి ఎలా ఉంది అంటే..బీజేపీతో సంసారం..టీడీపీతో సహజీవనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రజలకు ఫలానా పథకాలు తీసుకోస్తాం, ఫలానా అభివృద్ధి పనులు చేపడతాం అని చెప్పాలి…కానీ పవన్‌ ఎప్పుడన్నా అలాంటి మాటలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. పవన్‌ వెనకలా ఉన్న అసలైన నిర్మాత చంద్రబాబు. ఆయన దేని గురించి చెబితే పవన్‌ అదే మాట్లాడతాడు అంటూ విమర్శించారు. జగన్‌ వెంట ప్రజలు ఉన్నారు. పవన్ ఆయన దత్త తండ్రి లాంటి వారు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే ఎన్నుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారని అమర్నాథ్‌  చెప్పారు.

This post was last modified on August 11, 2023 7:25 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

6 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

6 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

8 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

8 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

12 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

14 hours ago