Political News

అసూయ, ద్వేషాలతోనే పవన్ అలా.. : మంత్రి అమర్నాథ్‌!

గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్ర వైజాగ్‌ లో ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో భాగంగా పవన్‌ రాత్రి జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఏపీ సీఎం జగన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి విరుచుకుపడ్డారు.తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జగనే అని విమర్శించారు. జగన్ తో పాటు ఆయన అనుచరులు అందరూ తెలంగాణలోని భూములు దోచుకు తిన్నారు. అందుకే అక్కడి వారందరూ తరిమేశారు. ఏపీకి పొమ్మని గట్టిగా బుద్ది చెప్పారు.

ఇక్కడ ఉన్న రుషి కొండ, ఎర్ర మట్టి దిబ్బలు, సహజ వనరులు కూడా దోచుకుంటున్నారని పవన్‌ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా కేంద్రంతో కలిసి నిన్ను ఒక ఆటాడిస్తా జగన్ అంటూ సీఎంకి వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్‌ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు.

విశాఖ వేదికగా పవన్‌ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్‌ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు. జగన్‌ కి పవన్‌ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలాంటిదో వేమన ఎప్పుడో చెప్పారంటూ పేర్కొన్నారు. పవన్‌ కి ఓ స్థిరత్వం, సిద్దాంతం ఏమి లేదు. ప్రస్తుతం పవన్‌ పరిస్థితి ఎలా ఉంది అంటే..బీజేపీతో సంసారం..టీడీపీతో సహజీవనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రజలకు ఫలానా పథకాలు తీసుకోస్తాం, ఫలానా అభివృద్ధి పనులు చేపడతాం అని చెప్పాలి…కానీ పవన్‌ ఎప్పుడన్నా అలాంటి మాటలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. పవన్‌ వెనకలా ఉన్న అసలైన నిర్మాత చంద్రబాబు. ఆయన దేని గురించి చెబితే పవన్‌ అదే మాట్లాడతాడు అంటూ విమర్శించారు. జగన్‌ వెంట ప్రజలు ఉన్నారు. పవన్ ఆయన దత్త తండ్రి లాంటి వారు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే ఎన్నుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారని అమర్నాథ్‌  చెప్పారు.

This post was last modified on August 11, 2023 7:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

14 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

1 hour ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago