తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్కు గట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ విజయం అంత సులభం కాదన్నది మాత్రం వాస్తవం. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు గెలవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 60 సీట్లు రావాలి. కాంగ్రెస్ ముందుగా ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోల్ సమర్పించిన నివేదిక మాత్రం పార్టీ నేతలకు షాక్ కలిగిస్తోందని తెలిసింది. ఈ నివేదిక ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా 41 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. ఈ 41 స్థానాలను ఏ కేటగిరీగా విభజించారు. ఇక కష్టపడితే గెలిచే 42 స్థానాలను బి కేటగిరీలో పెట్టారు. ఎక్కువ శ్రమపడాల్సిన 36 స్థానాలను సి కేటగిరీలో పెట్టారు.
సునీల్ కనుగోల్ నివేదిక ప్రకారం కాంగ్రెస్ 41 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందని అంచనా వేశారు. దీంతో అధికారం దక్కాంలంటే ఆ పార్టీ మరో 19 స్థానాల్లో గెలిస్తే చాలన్న మాట. కానీ సీట్లు తక్కువ వచ్చినా ఎంఐఎం లాంటి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే కష్టపడితే గెలిచే ఛాన్స్ ఉన్న 42 స్థానాలపైనా కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసిందే. ఈ స్థానాల్లోనూ ప్రచారాన్ని హోరెత్తించి, ప్రజల నమ్మకాన్ని చూరగొనాలనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలిసింది.
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…