Political News

ఆ 42 స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్‌కు ఛాన్స్‌!

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను ఓడించి, అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆ పార్టీకి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌కు గ‌ట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్ మాత్ర‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ విజ‌యం అంత సుల‌భం కాద‌న్నది మాత్రం వాస్త‌వం. అందుకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సీట్లు గెల‌వ‌డంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.

తెలంగాణ‌లో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 60 సీట్లు రావాలి. కాంగ్రెస్ ముందుగా ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ అందుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోల్ స‌మ‌ర్పించిన నివేదిక మాత్రం పార్టీ నేత‌ల‌కు షాక్ క‌లిగిస్తోంద‌ని తెలిసింది. ఈ నివేదిక ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌చ్చితంగా 41 స్థానాల్లో గెలుస్తుంద‌ని తేలింది. ఈ 41 స్థానాల‌ను ఏ కేట‌గిరీగా విభ‌జించారు. ఇక క‌ష్ట‌ప‌డితే గెలిచే 42 స్థానాల‌ను బి కేట‌గిరీలో పెట్టారు. ఎక్కువ శ్ర‌మ‌ప‌డాల్సిన 36 స్థానాల‌ను సి కేట‌గిరీలో పెట్టారు.

సునీల్ క‌నుగోల్ నివేదిక ప్ర‌కారం కాంగ్రెస్ 41 స్థానాల్లో క‌చ్చితంగా గెలుస్తుంద‌ని అంచ‌నా వేశారు. దీంతో అధికారం ద‌క్కాంలంటే ఆ పార్టీ మ‌రో 19 స్థానాల్లో గెలిస్తే చాల‌న్న మాట‌. కానీ సీట్లు త‌క్కువ వ‌చ్చినా ఎంఐఎం లాంటి ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అందుకే క‌ష్ట‌ప‌డితే గెలిచే ఛాన్స్ ఉన్న 42 స్థానాల‌పైనా కాంగ్రెస్ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలిసిందే. ఈ స్థానాల్లోనూ ప్ర‌చారాన్ని హోరెత్తించి, ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొనాల‌నేది కాంగ్రెస్ వ్యూహంగా తెలిసింది. 

Share
Show comments
Published by
Satya
Tags: Congress

Recent Posts

మరో శుక్రవారం… మళ్ళీ అదే కథ

బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…

13 minutes ago

ఫ్లెక్సీ టికెట్ ధరలు నిజంగా మేలు చేస్తాయా

టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…

1 hour ago

‘సీఎం’ విజయ్ కు లైన్ క్లియర్!

తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…

2 hours ago

ఎవ‌రీ అర్లేక‌ర్‌… ఎందుకింత ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేక‌ర్‌. ఈయ‌న త‌మిళ‌నాడుకు ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా…

3 hours ago

కొర‌వ‌డిన రాజ్యాంగం: విజ‌య్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది?

దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం…

3 hours ago

ఫ‌స్ట్ టైమ్ ఎంపీ: తండ్రికి త‌గ్గ వార‌సుడు.. !

పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.…

4 hours ago