తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి. వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కస్సున లేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లేదా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి దక్కుతాయని అంటుంటారు. ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏమో సీఎం జగన్, అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందింది. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిది.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి జగన్ నమ్మిన బంటుగా పేరుందని అందరూ చెబుతుంటారు. ఇటీవల పొంగులేటి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు జగన్ను నాలుగైదు సార్లు పొంగులేటి కలిశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా కలిశారని తెలిసింది. జగన్ ప్రభుత్వం కూడా పొంగులేటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు అప్పగిస్తుందనే వాదన ఉంది. తాజాగా భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చారని తెలిసింది.
ఇలా పొంగులేటిని పిలిచి మరీ కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్కు జగన్ ఫండింగ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్కు.. తెలంగాణలోనూ సానుకూల పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలోనూ ఈ సారి కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కూడా క్రమంగా పుంజుకుంటోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ నుంచి తనకు ప్రమాదం లేకుండా చేసుకోవడం కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on August 11, 2023 3:00 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…