Political News

కాంగ్రెస్ కోసం.. పొంగులేటితో జ‌గ‌న్!

త‌న తండ్రి వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్ న‌మ్మ‌క ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి. వైసీపీని స్థాపించారు జ‌గ‌న్. ఎంతో క‌ష్ట‌ప‌డి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జ‌గ‌న్ క‌స్సున లేస్తార‌నే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోస‌మే జ‌గ‌న్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉప‌యోగించుకుంటున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధిక ప్ర‌భుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి ఎల‌క్ట్రిక‌ల్స్ లేదా రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీకి ద‌క్కుతాయ‌ని అంటుంటారు. ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రిక‌ల్స్ ఏమో సీఎం జ‌గ‌న్‌, అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందింది. ఇక రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జ‌గ‌న్ న‌మ్మిన బంటుగా పేరుంద‌ని అంద‌రూ చెబుతుంటారు. ఇటీవ‌ల పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు జ‌గ‌న్‌ను నాలుగైదు సార్లు పొంగులేటి క‌లిశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన త‌ర్వాత కూడా క‌లిశారని తెలిసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా పొంగులేటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు అప్ప‌గిస్తుంద‌నే వాద‌న ఉంది. తాజాగా భూగ‌ర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చార‌ని తెలిసింది.

ఇలా పొంగులేటిని పిలిచి మ‌రీ కాంట్రాక్టులు ఇవ్వ‌డం వెనుక జ‌గ‌న్ వ్యూహం దాగి ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్కు జ‌గ‌న్ ఫండింగ్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్‌కు.. తెలంగాణ‌లోనూ సానుకూల ప‌రిస్థితులున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కేంద్రంలోనూ ఈ సారి కాంగ్రెస్ ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉన్న ఇండియా కూట‌మి కూడా క్ర‌మంగా పుంజుకుంటోంది. అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కాంగ్రెస్ నుంచి త‌న‌కు ప్ర‌మాదం లేకుండా చేసుకోవ‌డం కోస‌మే జ‌గ‌న్ ఇదంతా చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

This post was last modified on August 11, 2023 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago