Political News

కాంగ్రెస్ కోసం.. పొంగులేటితో జ‌గ‌న్!

త‌న తండ్రి వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్ న‌మ్మ‌క ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి. వైసీపీని స్థాపించారు జ‌గ‌న్. ఎంతో క‌ష్ట‌ప‌డి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జ‌గ‌న్ క‌స్సున లేస్తార‌నే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోస‌మే జ‌గ‌న్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉప‌యోగించుకుంటున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధిక ప్ర‌భుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి ఎల‌క్ట్రిక‌ల్స్ లేదా రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీకి ద‌క్కుతాయ‌ని అంటుంటారు. ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రిక‌ల్స్ ఏమో సీఎం జ‌గ‌న్‌, అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందింది. ఇక రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జ‌గ‌న్ న‌మ్మిన బంటుగా పేరుంద‌ని అంద‌రూ చెబుతుంటారు. ఇటీవ‌ల పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు జ‌గ‌న్‌ను నాలుగైదు సార్లు పొంగులేటి క‌లిశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన త‌ర్వాత కూడా క‌లిశారని తెలిసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా పొంగులేటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు అప్ప‌గిస్తుంద‌నే వాద‌న ఉంది. తాజాగా భూగ‌ర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చార‌ని తెలిసింది.

ఇలా పొంగులేటిని పిలిచి మ‌రీ కాంట్రాక్టులు ఇవ్వ‌డం వెనుక జ‌గ‌న్ వ్యూహం దాగి ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్కు జ‌గ‌న్ ఫండింగ్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్‌కు.. తెలంగాణ‌లోనూ సానుకూల ప‌రిస్థితులున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కేంద్రంలోనూ ఈ సారి కాంగ్రెస్ ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉన్న ఇండియా కూట‌మి కూడా క్ర‌మంగా పుంజుకుంటోంది. అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కాంగ్రెస్ నుంచి త‌న‌కు ప్ర‌మాదం లేకుండా చేసుకోవ‌డం కోస‌మే జ‌గ‌న్ ఇదంతా చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

This post was last modified on August 11, 2023 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago