తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి. వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కస్సున లేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లేదా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి దక్కుతాయని అంటుంటారు. ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏమో సీఎం జగన్, అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందింది. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిది.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి జగన్ నమ్మిన బంటుగా పేరుందని అందరూ చెబుతుంటారు. ఇటీవల పొంగులేటి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు జగన్ను నాలుగైదు సార్లు పొంగులేటి కలిశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా కలిశారని తెలిసింది. జగన్ ప్రభుత్వం కూడా పొంగులేటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు అప్పగిస్తుందనే వాదన ఉంది. తాజాగా భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చారని తెలిసింది.
ఇలా పొంగులేటిని పిలిచి మరీ కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్కు జగన్ ఫండింగ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్కు.. తెలంగాణలోనూ సానుకూల పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలోనూ ఈ సారి కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కూడా క్రమంగా పుంజుకుంటోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ నుంచి తనకు ప్రమాదం లేకుండా చేసుకోవడం కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on August 11, 2023 3:00 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…