Political News

కేంద్రంతో క‌లిసి జ‌గ‌న్‌ను ఓ ఆట ఆడిస్తా: ప‌వ‌న్‌

కేంద్రంతో క‌లిసి జ‌గ‌న్ రెడ్డిని ఓ ఆట ఆడిస్తా.. అంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వారాహి యాత్ర 3.0లో భాగంగా ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలోకి ర‌ద్దీ కూడ‌లి జ‌గదాంబ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో వారాహి వాహ‌నంపై నుంచే ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర్కారు స‌హా వైసీపీ నాయ‌కుల‌పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

“రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్‌ మద్దతుదారులందరి జాబితా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. దోపిడీ దారుల బండారం బయటపడే రోజు దగ్గర్లోనే ఉంది. జగన్‌.. కేంద్రంతో క‌లిసి  నిన్ను ఆటాడించకపోతే చూడు” అని ప‌వ‌న్ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. విశాఖ జిల్లా సంఘ విద్రోహశక్తుల అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. ల్యాండ్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయన్నారు.

దివాలా తీసిన బైజూస్‌ కంపెనీకి రూ.500 కోట్లు ఇచ్చారని సీఎం జ‌గ‌న్ సొంత సొమ్మా?  ప్ర‌జ‌ల క‌ష్టార్జిత‌మా? అని ప‌వ‌న్ నిల‌దీశారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను రూ.25వేల కోట్లకు తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం జ‌గ‌న్‌కు ఎవ‌రిచ్చార‌ని అన్నారు.  “పరిశ్రమలు వ‌స్తే నాకేంటి.. ఎంత వాటా? అని అడుగుతారు. ఎంత డబ్బు తింటావు.. వేల కోట్లు ఏం చేసుకుంటావు” అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.  జగన్‌ నాయకుడు కాదు.. వ్యాపారి అని పేర్కొన్నారు. మద్యంపై  30 వేల కోట్లు ఆర్జించారని చెప్పారు. జగన్‌కు మరో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ప‌వ‌న్ వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.  

అన్నా అని పిలిచి..

“ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైఖ‌రి భిన్నంగా ఉంటుంది. వాత పెట్టేముందు.. ఆయ‌న చ‌క్క‌గా చిరున‌వ్వుతో అన్నా అని పిలుస్తాడు. దానిని న‌మ్మితే.. జైలుకు వెళ్ల‌డ‌మే” అని ప‌వన్ అన్నారు. “రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెబితే.. వైసీపీ నేతలంతా నాపై విరుచుకుప‌డ్డారు. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. వాలంటీర్లపై నాకు ద్వేషం లేదు. కానీ, మీ ద్వారా డేటా సేకరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. సీఎం జగన్‌.. అన్నా.. అక్కా.. అంటూ అధికారులను సంబోధిస్తుంటారు. సీఎం.. అన్నా అని పిలిచాడని పొంగిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత జైలుకు వెళ్ల‌డ‌మే” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on August 10, 2023 10:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

56 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago