Political News

విశాఖలో పవన్ కు మంచి శకునం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటినస్తోన్న సంగతి తెలిసిందే. మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచి మొదలుపెట్టబోతున్నారు పవన్ కల్యాణ్.  వారాహి యాత్రలో తొలి, రెండో విడత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ ఊపుతో మూడో విడత యాత్రను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన కీలక మహిళా నేత జనసేనలో చేరారు.

టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి పడాల అరుణ జనసేన అధినేత  పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పడాల అరుణకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని, అందుకే జనసేనలో చేరానని అన్నారు. పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచారు. చంద్రబాబు హయాంలో మంత్రి పని చేశారు. రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేసిన అరుణ…తాజాగా జనసేనలో చేరారు.

ఈ రోజు విశాఖ జగదాంబ సెంటర్ నుంచి వారాహి యాత్ర మొదలుకానుంది. 14వ తేదీ దాకా విశాఖలో పవన్ ఉండి 15, 16 తేదీల్లో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిచనున్నారు. అయితే, పవన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు నిర్ణయించిన రూట్ లో కాకుండా ఎయిర్‌‌ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని సూచించారు. రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు వద్దని ఆంక్షలు విధించారు.

This post was last modified on August 10, 2023 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago