Political News

విశాఖలో పవన్ కు మంచి శకునం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటినస్తోన్న సంగతి తెలిసిందే. మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచి మొదలుపెట్టబోతున్నారు పవన్ కల్యాణ్.  వారాహి యాత్రలో తొలి, రెండో విడత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ ఊపుతో మూడో విడత యాత్రను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన కీలక మహిళా నేత జనసేనలో చేరారు.

టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి పడాల అరుణ జనసేన అధినేత  పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పడాల అరుణకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని, అందుకే జనసేనలో చేరానని అన్నారు. పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలిచారు. చంద్రబాబు హయాంలో మంత్రి పని చేశారు. రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేసిన అరుణ…తాజాగా జనసేనలో చేరారు.

ఈ రోజు విశాఖ జగదాంబ సెంటర్ నుంచి వారాహి యాత్ర మొదలుకానుంది. 14వ తేదీ దాకా విశాఖలో పవన్ ఉండి 15, 16 తేదీల్లో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిచనున్నారు. అయితే, పవన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు నిర్ణయించిన రూట్ లో కాకుండా ఎయిర్‌‌ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని సూచించారు. రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు వద్దని ఆంక్షలు విధించారు.

This post was last modified on August 10, 2023 10:11 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

3 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

4 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago