తిరుపతి నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు అధికార వైసీపీ వేట మొదలెట్టింది. తిరుపతిలో వైసీపీ అంటే భూమన కరుణాకర్రెడ్డి పేరే గుర్తుకు వచ్చేది. అంతలా ఆ నియోజకవర్గంలో ఆయన పట్టు సాధించారు. మరోవైపు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కూడా కావడంతో భూమన జోరు కొనసాగింది. కానీ 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని భూమన చెప్పారు. అన్నట్లే 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని తెలిసింది.
ఇక భూమన కరుణాకర్రెడ్డి స్థానంలో తిరుపతిలో వైసీపీ తరపున పోటీ చేసేది ఎవరనే ప్రశ్న కలుగుతోంది. ఇందుకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు కరుణాకర్రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి. రెండో వ్యక్తి మేయర్ డాక్టర్ శిరీష. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికైన శిరీషకు పార్టీ మేయర్ పదవి కట్టబెట్టింది. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, పైగా తిరుపతిలో బలిజ తెగలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం శిరీషకు కలిసొస్తుందని అంటున్నారు. ఓసీ, మైనార్టీల్లోనూ ఆమెకు మంచి పేరుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన భూమన అభినయ్ రెడ్డి మున్సిపల్ కార్పొరేటర్గా ఏకగ్రీవంగా గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా మంచి నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలనూ తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయవంతమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పని చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే ఈ సారి తిరుపతి వైసీపీ సీటు కచ్చితంగా అభినయ్ రెడ్డికే దక్కుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శిరీష కంటే కూడా అభినయ్కే జగన్ అవకాశం ఇచ్చే ఆస్కారముందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
This post was last modified on August 10, 2023 6:22 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…