Political News

తమ్ముడికి జ్ఞానబోధ చెయ్యండి చిరంజీవి గారు

ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మానుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ లోని వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలితోపాటు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స, ఎంపీ నందిగం సురేష్ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి జ్ఞానబోధ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, కానీ సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దు అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారని  అన్నారు. అయితే, ఆ గొడవ మొదలుబెట్టింది పవన్ అని చిరంజీవి తెలుసుకోవాలని గుర్తు చేశారు. దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారని విమర్శించారు. బ్రో సినిమాలో అంబటి పాత్రను సృష్టించింది ఎవరని? ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. సినిమాలను పిచ్చుక అంటూ ఇండస్ట్రీని తక్కువ చేయడం ఏంటని అమర్నాథ్ ప్రశ్నించారు.

తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి అంబటి రాంబాబు సూచించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారా లేదా చిరంజీవి చెప్పాలని నిలదీశారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని ఆయన ఏం మాట్లాడారో చూసి రేపు మళ్లీ మాట్లాడుతానని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా స్పందించారు. ఈ గొడవను మొదలుపెట్టింది మీ తమ్ముడు అని, బురద రాజకీయాలు మానుకోవాలని తమ్ముడికి హితవు చెప్పాలని సురేష్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా తేవాలో తాము చూసుకుంటామని చెప్పారు. సినిమా పరిశ్రమను పిచ్చుక అంటూ చిరంజీవి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదని బొత్స అన్నారు. చిరంజీవి ఆ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

This post was last modified on August 9, 2023 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago