తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 25 సీట్లకు మించి వచ్చే అవకాశంలేదన్నారు. కేసీయార్ ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు మ్యాగ్జిమమ్ 25 అని కచ్చితంగా చెప్పారు. అంత కచ్చితంగా ఎలా చెబుతారంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పారు. మరి రేవంత్ కాన్ఫిడెంట్ ఏమిటో తెలీదు.
బీఆర్ఎస్ కు వచ్చేసీట్ల సంఖ్యను చెప్పారు కానీ కాంగ్రెస్ కు ఎన్నిసీట్లు వస్తుందనే విషయాన్ని రేవంత్ చెప్పలేదు. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతు 70 సీట్లలో మినిమం గెలవాలని పదేపదే చెబుతున్నారు. 119 నియోజకవర్గాల్లో 70 సీట్లలో మినిమం అంటే 65 శాతం అన్నమాటే. మరి కాంగ్రెస్ కు అంత సీనుందా అన్నదే అర్ధంకావటంలేదు. ఎందుకంటే పార్టీ సీనియర్లలో గ్రూపు తగాదాలు చాలా ఎక్కువ. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పార్టీ నాశనమైపోయినా పట్టించుకోరు.
ఇలాంటి కారణాలతోనే, వ్యక్తిగత ప్రిస్టేజ్ కి వెళ్ళటం వల్లే గడచిన రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. నేతల్లోనే ఒకళ్ళని ఓడించటానికి మరొకళ్ళు ప్రయత్నించటం, గెలుపుకు సహకరించకుండా దూరంగా ఉండటం, ప్రత్యర్ధి పార్టీ గెలుపుకు సహకరించటం లాంటి కారణాలతోనే కాంగ్రెస్ చాలా సీట్లను కోల్పోయింది. పోయిన ఎన్నికల్లో సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి గట్టిగా ప్రయత్నించుంటే మంచి ఫలితాలే వచ్చుండేవి.
రెండు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇక అంతే సంగతులు. ఒకపార్టీ మూడు వరుస ఎన్నికల్లో ఓడిపోతే నేతలు, క్యాడర్ పార్టీని అంటిపెట్టుకుని ఉండటం కష్టమే. మెల్లిగా కాంగ్రెస్ మాయమైపోవటం ఖాయం. ఆ ప్రమాదాన్ని గ్రహించిన కారణంగానే డైరెక్టుగా అధిష్టానమే రంగంలోకి దిగి సినియర్ నేతలందరినీ సమన్వయం చేసి ఏకతాటిపైన నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏ సీనియర్ ఏమిచేస్తారో చివరి నిముషం వరకు రేవంత్ కూడా ఊహించలేరు. అందుకనే పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యను కాకుండా బీఆర్ఎస్ గెలవబోయే సంఖ్యను చెప్పారు.
This post was last modified on August 9, 2023 1:03 pm
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…